కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు నామ పత్రాలు అందజేస్తున్న నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి, చిత్రంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్, ఈరవత్రి అనిల్, ఏ.లలిత
నిజామాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ ఏ.లలితతో కలిసి రెండు సెట్ల నామ పత్రాలను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణుతో కలిసి మరో రెండు సెట్ వేశారు.
భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తరఫున నామినేషన్ వేస్తున్న పార్టీ ప్రతినిధులు పల్లె గంగారెడ్డి, దినేష్, ప్రకాష్రెడ్డి, స్రవంతి, బోగ శ్రావణి
భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తరఫున పార్టీ నాయకులు పల్లె గంగారెడ్డి, దినేష్ కులాచారి, మేడపాటి ప్రకాశ్రెడ్డి, స్రవంతిరెడ్డి, బోగ శ్రావణి మూడో సెట్ నామ పత్రాలు అందజేశారు. బీఫాం అందజేశారు. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున ఆయన కొడుకు బాజిరెడ్డి జగన్, నాయకులు నాలుగో సెట్ పత్రాలు దాఖలు చేశారు. రాజ్కుమార్(ఇండియా ప్రజాబంధు పార్టీ), పానుగంటి రజిత వాణి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), నాగార్జున(ప్రజాసేన పార్టీ) నామినేషన్ వేశారు. స్వతంత్రులు రాజేందర్, గంగాధర్, నవీన్, రఘు, ఎం.డి. షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ) అభ్యర్థులు నామినేషన్ వేశారు. పార్లమెంట్ స్థానానికి ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు 62 సెట్ల నామినేషన్ పత్రాలు వేసినట్లు రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
నేటితో ఆఖరు: నామినేషన్ దాఖలుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ నెల 18 నుంచి నామ పత్రాల స్వీకరణ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలైన భారాస, భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కలిసి గురువారం మరో సెట్ వేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగు మారిన మిషన్ భగీరథ నీరు
[ 27-07-2024]
మండలంలోని తాండూర్ గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్భగీరథ నీరు కలుషితంగా వస్తోంది. -
ఎన్ఏ సర్వేపై ఉపాధ్యాయులకు శిక్షణ
[ 27-07-2024]
జాతీయ సాధన సర్వే (నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే) 2024 లో భాగంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్