సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు.
ప్రధాన పార్టీల వ్యూహాలు
ఈనాడు, నిజామాబాద్
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. వీరంతా ప్రచారంలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. అవకాశం ఉన్న అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రభావం చూపే వర్గాలే లక్ష్యంగా హామీలిస్తున్నారు. తమ విధానాలు వివరిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు పోటీ పడుతున్నారు. పార్టీల ముఖ్య నేతలు సభలకు వస్తుండటంతో ప్రచారం హోరెత్తుతోంది.
పరస్పరం పోటీపడుతూ..
పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటంతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇదే క్రమంలో ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇందూరు ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములవుతారు. ఈ సందర్భాన్ని నాయకులంతా తమకు చిక్కిన అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. సాధారణంగా ప్రత్యర్థులంతా వేర్వేరు చోట్ల తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటారు. కానీ, మూడు పార్టీల అభ్యర్థులు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని భక్తుల మధ్యే గడిపారు. చూసేవారికి స్వామికార్యం, స్వకార్యం రెండు ఒకేచోట అన్నట్లుగా కనిపించటం విశేషం.
సభలతో ఉత్సాహం..
నిజామాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఓటర్లకు హామీలు ఇవ్వడంతో పాటు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని శ్రేణులకు సూచించారు. ఆ పార్టీ నాయకులు ప్రచార ఘట్టంలో ఉత్సాహంగా కదులుతున్నారు. భారాస సైతం నామినేషన్ దాఖలు సందర్భంగా సభ నిర్వహించింది. ఈ సందర్భంలో హాజరైన నాయకులు ఉద్యమ కాలం నాటి ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. వీరంతా ప్రచారంలో భాగమవుతున్నారు. నియోజకవర్గంలో ముందస్తుగా ప్రచారం మొదలెట్టిన భాజపా, జగిత్యాలలో మోదీ సభను నిర్వహించింది. పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు. రెండో విడతగా మరో ఎన్నికల సభను గురువారం నిజామాబాద్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సభకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరవుతున్నారు. భారీ జనసమీకరణ చేయాలని భాజపా సన్నాహాలు చేస్తోంది.
ప్రభావిత వర్గాలను కలుస్తూ..
మూడు పార్టీల నేతలు ప్రభావం చూపే సామాజికవర్గాల పెద్దలను కలిసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. వీరి ఓట్లు పెద్దసంఖ్యలో ఉండటంతో తమ పార్టీకే వేసేలా సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వివరిస్తూ.. ఎవరికి వారు తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. సంప్రదింపుల సమయంలో హామీలూ ఇస్తున్నారు. వచ్చిన చిక్కాల్లా ఏంటంటే..కలుస్తున్న ప్రతి అభ్యర్థితో ఆయా వర్గాల పెద్దలు సానుకూలంగానే మాట్లాడి పంపిస్తున్నారు. చివరికి వీరు ఎటువైపు నిలుస్తారు? సామాజికవర్గం వాళ్లు వారు వీరి మాటకు కట్టుబడి ఓట్లు వేస్తారా? అనే సందేహాలు నాయకుల్లోనూ వ్యక్తమవుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్