ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది.
ప్రథమంలో 27.. ద్వితీయంలో 29వ స్థానం
ఏటేటా ఫలితాల్లో వెనుకబడుతున్న జిల్లా
న్యూస్టుడే, నిజామాబాద్ విద్యావిభాగం
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా మార్చి 14న ప్రధాన, మార్చి 19న వృత్తివిద్య పరీక్షలు ముగిశాయి. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 14,974 మంది, వృత్తివిద్యలో 2399 మంది పరీక్షలు రాయగా, ద్వితీయ జనరల్ విభాగంలో 13,988, ప్రైవేటులో 1,804, వృత్తివిద్య విభాగంలో 2,192 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకన ప్రక్రియ మార్చి 2న ప్రారంభించిన అధికారులు 20 రోజుల క్రితమే పూర్తి చేశారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడం, రాష్ట్రస్థాయిలో ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఇందూరు ఏటా వెనుకబడుతుండటం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది. బోధనలో నాణ్యత పెంచాల్సిన అవసరముందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో అనుత్తీర్ణులైన వారితో పాటు మార్కులు పెంచుకోవాలనుకునే వారి కోసం విద్యాశాఖ రీకౌంటింగ్, రీ వాల్యుయేషన్కి ఈ నెల 25 నుంచి మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి పేపర్కు రీ వెరిఫికేషన్ చేయించుకోవాలనే విద్యార్థులు రూ.100 చొప్పున, రీకౌంటింగ్తో పాటు పరీక్ష జవాబు పత్రాల జిరాక్స్ పత్రాలు పొందడానికి రూ.600 చొప్పున ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆందోళన వద్దు.. ఆలోచనతో ముందుకు..
రవికుమార్, డీఐఈవో
అనుత్తీర్ణులైన వారు ఆందోళన చెందొద్దు. వెంటనే నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఆలోచనతో ముందడుగు వేయాలి. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. ఇంకా ఏమైనా అనుమనాలుంటే టెలిమానస్, 14416 టోల్ఫ్రీ నెంబర్లను సంప్రదించాలి. ఫలితాల్లో తప్పులు గుర్తిస్తే helpdeskie@telangana.gov.in ను సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్