logo

ఓపెన్‌ జిమ్‌ను సందర్శించిన బల్దియా ఛైర్‌పర్సన్‌

జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు ప్రాంతంలోని ఓపెన్‌జిమ్‌ను పురపాలక ఛైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ సోమవారం సందర్శించారు.

Published : 21 May 2024 05:03 IST

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు ప్రాంతంలోని ఓపెన్‌జిమ్‌ను పురపాలక ఛైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ సోమవారం సందర్శించారు. రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన జిమ్‌లను పట్టించుకోవడం లేదని ఈనాడులో ‘పర్యవేక్షణ కరవు’ శీర్షికన 20వ తేదీన ప్రచురితమైన చిత్ర కథనానికి ఛైర్‌పర్సన్‌ స్పందించి ఓపెన్‌జిమ్‌ను పరిశీలించారు. ధ్వంసమైన పరికరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. సమీపంలోని ఉద్యానంలో మరమ్మతులు చేపడతామన్నారు. వెంట కౌన్సిలర్‌ పాత శివకృష్ణమూర్తి, చాట్ల వంశీకృష్ణ, నాయకులు సలీం, ప్రసాద్‌ తదితరులున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని