ఫలితాలు మెరుగయ్యేనా..?
ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది.
24 నుంచి ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది. ప్రథమ సంవత్సరంలో 7,658కి 2,666, ద్వితీయ సంవత్సరంలో 7,234కి 3,204 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండింట్లో జిల్లాకు 35వ స్థానం దక్కింది. 24వ తేదీ నుంచి 29 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలను విద్యార్థులు రాయనున్నారు. పడిపోయిన ఫలితాలు మెరుగయ్యేందుకు ప్రస్తుతం జరిగే పరీక్షలపై అధికారులు దృష్టిపెట్టారు.
ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ..
ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో అనుత్తీర్ణులైన విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు నిపుణులు నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 29 మంది ముఖ్య పర్యవేక్షకులు, 29 మంది విభాగ పర్యవేక్షకులు, 4 సిట్టింగ్ స్క్వాడ్లు, ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షలను పర్యవేక్షిస్తారు. తరగతి గదుల్లో చీకటి లేకుండా విద్యుత్తు సౌకర్యం కల్పించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, ఫ్యాన్లు తదితర వసతులు కల్పించారు.
హాల్టికెట్లు పొందాలి
సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులు సంబంధిత కళాశాలలో హాల్టికెటు పొందాలని లేదా ఇంటర్ విద్యాశాఖ పోర్టల్ నుంచి హాల్టికెట్లు తీసుకుంటే దానిపై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, చరవాణికి అనుమతి లేదు.
ఆందోళన చెందొద్దు
షేక్ సలాం, ఇంటర్ జిల్లా విద్యాధికారి
సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు ఆందోళన చెందొద్దు. పరీక్ష హాల్లో ప్రశాంతంగా ఉండాలి. ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత పది నిమిషాల పాటు క్షుణ్ణంగా చదివి సమాధానాలు రాయాలి. కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు