చరిత్ర శిథిలం.. పాలకులూ.. పట్టించుకోరా..
నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు.
మరమ్మతులకు నోచుకోని ఖిల్లా జైలు
కూలడానికి సిద్ధంగా ఉన్న రఘునాథాలయ ప్రాంగణం
ఖిల్లా రఘునాథాలయం స్వాగత ద్వారంపై ఏపుగా పెరిగిన చెట్టు
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం: నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రాణాలు సైతం త్యాగం చేశారు. రాజకీయ ఖైదీల బొందలగడ్డగా పేరుపొందిన ఖిల్లా జైలు ఎందరో ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. జైలు గది గోడలపై దాశరథి కృష్ణమాచార్యులు రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ గీతం తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలకు ఊపిరులూదింది. గతమెంతో ఘనకీర్తి ఉన్న ఈ ప్రాంగణాన్ని పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరింది. పర్యాటక కేంద్రంగా మారుస్తామన్న పాలకుల హామీ ప్రతిపాదనలకే పరిమితమైంది. తెలంగాణ తొలి ప్రభుత్వం దాశరథి స్మారక కేంద్రంగా మార్చేందుకు విగ్రహాలను తీసుకొచ్చి జైలుగదిలో ఉంచారు. ఆ తర్వాత ఆలనాపాలనా మరిచారు. దీంతో ప్రారంభించకుండానే అవి పాడవుతున్నాయి. రఘునాథాలయ ప్రాంగణంలో విశాలమైన గది కూలడానికి సిద్ధంగా ఉంది. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వమైనా స్పందించి నాటి ఆనవాళ్లను పరిరక్షించాలని చరిత్రకారులు కోరుతున్నారు.
శ్రీరాముడి కల్యాణ ప్రాంగణంలో పైకప్పు పడిపోకుండా కర్రలు అడ్డుపెట్టారిలా..
ఘనమైన గతం ఉన్నా..
53 ఎకరాల సువిశాల ఎత్తైన కొండపై ఖిల్లా జైలు, రఘునాథాలయం ఉన్నాయి. 9వ శతాబ్దంలో మూడో రాష్ట్రకూట చక్రవర్తి ఇంద్రనారాయణుడు ఈ కోటను నిర్మించాడు. చాలా ఏళ్లు సైనిక స్థావరంగా కొనసాగింది. సైనికులకు ఇక్కడే ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారని అంటారు. నాలుగు వందల ఏళ్ల క్రితం నైజాం కాలంలో జైలుగా మార్చారు. ఎనిమిది బారెక్లు ఉన్న జైలులో తెలంగాణ విమోచన కోసం వందల మంది ఉద్యమకారులు ఇక్కడే కఠిన శిక్షలు అనుభవించారు. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు, ప్రముఖ నవలా రచయిత వట్టికోట ఆళ్వార్స్వామి జైలు జీవితం గడిపారు. తర్వాతి కాలంలో ఈ జైలును సారంగాపూర్కు తరలించారు. దాశరథి శిక్ష అనుభవించిన జైలుగది ప్రస్తుతం శిథిలంగా మారింది. గోడలపై ఉంచిన దాశరథి అరుదైన చిత్రాలు నీటితో తడిసిపోతున్నాయి. జైలుకు కమాన్ను రెండు అంతస్తుల్లో పది గదులతో నిర్మించారు. జైలు కొనసాగిన రోజుల్లో ఇక్కడే జైలు అధికారులు పహారా కాసేవారు. ప్రస్తుతం దీనిపై పిచ్చిమొక్కలు పెరిగి చెట్లుగా మారాయి. చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఈ నిర్మాణం ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర పర్యాటక శాఖ, పురావస్తు, దేవాదాయశాఖ అధికారులు ప్రాంగణాన్ని సందర్శించారు.రూ.2.50 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేశారు. తర్వాత రూ.5 లక్షలతో దాశరథి కల్చరల్ హాలు, అదనపు పనుల కోసం రూ.5 లక్షల నిధులు కేటాయించారు. తర్వాత మరిచిపోయారు.
పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి
- కందకుర్తి యాదవరావు, చరిత్ర పరిశోధకుడు
ఎంతో ఘనచరిత్ర ఉన్న ఖిల్లా రఘునాథాలయం, జైలు ప్రాంగణాన్ని కాపాడాలి. విలువైన ఇక్కడి భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలి. పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. కింద నుంచి జైలు వరకు రోప్వే ఏర్పాటు చేయాలి. దాశరథి, పోలీసుల ప్రతిమలు ఏర్పాటు చేయాలి. స్వాగత తోరణానికి మరమ్మతులు చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ