పసుపు పంటకు జై
తొలకరి రాగానే జూన్ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ సీజన్లో 20 శాతం అదనపు సాగు
దుక్కులు సిద్ధం చేసుకుంటున్న రైతులు
పసుపు విత్తుకునేందుకు సిద్ధం చేసిన నేల
ఈనాడు, నిజామాబాద్, న్యూస్టుడే, ఆర్మూర్ గ్రామీణం: తొలకరి రాగానే జూన్ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఐదేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గుతూ రాగా.. ఈ సారి మాత్రం ఈ పంట వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో గిట్టుబాటు ధర దక్కక సాగుకు దూరమైన వారు తిరిగి వేసేందుకు ఆలోచన చేస్తున్నారు. 9 నెలలు పండించి, ఉడకబెట్టి, ఆరబెట్టి మార్కెట్కు తీసుకెళ్తే.. అక్కడ ధర దక్కక రైతులు విసుగు చెందారు. కానీ, ఈ సీజన్లో అనూహ్యంగా రికార్డు స్థాయి ధరలు నమోదవడంతో సాగుదారుల్లో ఆశలు పెంచింది. దీంతో కొత్త రైతులు సైతం నాటేందుకు ముందుకొస్తున్నారు. వీరంతా విత్తనం సేకరించే పనిలో ఉన్నారు.
ఐదేళ్ల తర్వాత మార్పు
గడిచిన నాలుగైదు ఏళ్లలో 35-40 శాతం మేర సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. గతంలో 35 - 40 వేల ఎకరాల్లో సాగయ్యేది. గత సీజన్లో 23 వేల ఎకరాలకు పడిపోయింది. సాగు వ్యయం పెరుగుతుండటం, ధర క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.6500 మధ్యలోనే ఉండటం రైతులను నిరాశకు గురిచేసింది. కొవిడ్ తర్వాత అంతర్జాతీయంగా పసుపు వినియోగం పెరిగినా.. డిమాండ్ రాకపోవడంపై చర్చ సాగింది. ఈ క్రమంలోనే దిగుమతులపై నియంత్రణ చర్యలు మొదలయ్యాయి. దీంతో ఎగుమతులకు అవకాశం ఏర్పడింది. దీంతో గడిచిన ఏడాది కాలంగా ధరలో కదలిక వచ్చింది. ఈ సీజన్లో మరింత పుంజుకొని సరాసరి రూ.13 వేల నుంచి రూ.14 వేల మధ్య ధరలు దక్కాయి. కొమ్ముకే కాదు..మండకు కూడా డిమాండ్ ఏర్పడటంతో రైతులను ఇటువైపు మొగ్గుచూపేలా చేస్తోందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది 20 శాతం మేర సాగు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
విత్తనానికి డిమాండ్
ఆర్మూర్ మండలం అంకాపూర్కు చెందిన సుమారు 30 మంది రైతులు నందిపేట్ మండలంలో ఎక్కువగా సాగు చేస్తున్న రైతుల నుంచి విత్తన పసుపు సేకరించారు. ఒక్కో ట్రాలీ ట్రాక్టర్ విత్తనం రూ.60 వేలకు కొనుగోలు చేశారు. ఇది రెండు ఎకరాలకు సరిపోతుంది. ఎకరం విస్తీర్ణంలో సాగు చేసేందుకు సుమారు 8- 10 క్వింటాళ్ల కొమ్ములు అవసరం. 10 క్వింటాళ్లకు రూ.30 వేలు వెచ్చించి విత్తనం కొంటున్నట్లు రైతులు చెప్పారు. ఏటా ఎకరం పండించే రైతు అదనంగా మరో రెండెకరాలు సిద్ధం చేసున్నట్లు అంకాపూర్కు చెందిన రైతు వెంకట్రెడ్డి చెప్పారు. ఇందుకోసం నూర్పిడి సమయంలోనే మేలైన విత్తనం సేకరించి పెట్టుకున్నట్లు వివరించారు. ఆర్మూర్ మండలం మగ్గిడికి చెందిన రైతు గంగాసాగర్ రెండేళ్లుగా సాగు ఆపేశారు. పంటకు డిమాండ్ ఏర్పడటంతో ఈ సారి మళ్లీ సాగు చేయాలని నిర్ణయించారు. తన గ్రామంలో తెలిసిన రైతు నుంచి రూ.30 వేలు చెల్లించి 10 క్వింటాళ్ల విత్తనం సేకరించారు.
ధర దక్కేలా చర్యలు అవసరం
- చిన్నారెడ్డి, రైతు, మగ్గిడి
ఏటా 4 నుంచి 5 ఎకరాల్లో సాగు చేస్తుంటాను. గడిచిన నాలుగైదు ఏళ్లుగా మంచి రకాలు పండించినా ధర దక్కలేదు. ఈ క్రమంలో రైతులు నిరాశ చెంది సాగు విస్తీర్ణం తగ్గిస్తూ వచ్చారు. ఈ సీజన్లో మంచి ధరలు దక్కాయి. ఈ ఏడాది మరో రెండు ఎకరాలు అదనంగా సాగు చేయాలనే ఆలోచన చేశాను. దుక్కిలు సిద్ధం చేసుకున్నాను. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన సైతం రైతుల్లో ఆసక్తికి కారణం. సాగు విస్తీర్ణం పెరిగిందని రానున్న రోజుల్లో ధర తగ్గకుండా.. దళారులు దగా చేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.
అదనంగా రెండెకరాలు వేస్తున్నా
- చరణ్రెడ్డి, అర్గుల్, జక్రాన్పల్లి
ఆరెకరాల్లో వేస్తుంటాం. కొంతకాలంగా పెట్టుబడులు ఎక్కువవుతున్నా ధర మాత్రం పెరగలేదు. దీంతో మా ప్రాంత రైతులు సాగుకు దూరమయ్యారు. అనూహ్యంగా ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉంది. పరిస్థితి చూసి మరికొందరు పసుపు వేయటానికి ముందుకొస్తున్నారు. నేను కూడా మరో రెండు ఎకరాలు అదనంగా వేయాలని నిర్ణయించుకున్నా. కొత్త రైతులు సైతం విత్తనం అడుగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు