అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నిబంధనలు తుంగలో తొక్కి అమ్యామ్యాలకు అలవాటుపడి నాన్లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసిన యంత్రాంగంపై కొరడా ఝుళిపించనుంది.
కామారెడ్డి, బాన్సువాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివరాల సేకరణ
ఈనాడు, కామారెడ్డి: సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నిబంధనలు తుంగలో తొక్కి అమ్యామ్యాలకు అలవాటుపడి నాన్లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసిన యంత్రాంగంపై కొరడా ఝుళిపించనుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం అక్రమ రిజిస్ట్రేషన్లపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విభాగం అధికారులు గత రెండు రోజుల నుంచి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని రికార్డులతో పాటు ఆన్లైన్ దస్త్రాలను పరిశీలిస్తున్నారు. కామారెడ్డి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో వీఎల్టీ పేరిట జరుగుతున్న అక్రమ వసూళ్లపై సైతం వివరాలు సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు విజిలెన్స్ను తప్పించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టారు.
అఫిడవిట్లు తీసుకొని..
నిబంధనల ప్రకారం బల్దియా నుంచి వీఎల్టీ రుసుం చెల్లించినట్లు ధ్రువపత్రాన్ని సమర్పించిన తర్వాతే ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా కామారెడ్డి సబ్రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది, అధికారులతో కుమ్మక్కయిన లేఖరులు వినియోగదారుల నుంచి ప్రత్యేకంగా అఫిడవిట్లు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. అఫిడవిట్ల జారీకి భారీగా వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. గతంలో వీఎల్టీ దందాపై పలువురు బల్దియా అధికారులతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు పురపాలక శాఖ నుంచి వీఎల్టీ ధ్రువపత్రాలు లేకుండా అఫిడవిట్ల ఆధారంగా జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు సేకరిస్తున్నారు.
నిషేధం ఉన్నా..
జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, ఎల్లారెడ్డి, బిచ్కుందలలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. బాన్సువాడ, కామారెడ్డి పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వం నాన్లేఅవుట్ ప్లాట్ల క్రయవిక్రయాలతో ఇబ్బందులు వస్తున్నాయనే ఉద్దేశంతో వాటి రిజిస్ట్రేషన్లపై 2020 ఆగస్టులో నిషేధం విధించింది. అక్రమాలకు అలవాటు పడిన సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల యంత్రాంగం నిషేధం ఉన్నా.. గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేసింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు కొనుగోలుదారులకు ఇంటి నిర్మాణాల సమయంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి.
వెనుక ఉన్నది ఎవరు?
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఇప్పటి వరకు ఎన్ని నాన్లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి వెనుక ఉన్న అధికారులు ఎవరు..? ప్రభుత్వ ఆదాయానికి ఎంతమేర గండి పడిందనే దానిపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారుల విచారణను కార్యాలయ సిబ్బందితో పాటు ఆ శాఖకు చెందిన అధికారులు సైతం గోప్యంగా ఉంచుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు
కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పాటైన తర్వాత పట్టణంతో పాటు శివారు గ్రామాల్లో పెద్దఎత్తున రియల్ వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఆయా వెంచర్లను లేఅవుట్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం పురపాలక శాఖ వెల్లడించిన నివేదికలో రాష్ట్రంలోనే కామారెడ్డి బల్దియాలోనే నాన్లేఅవుట్ వెంచర్లు 139 ఉన్నట్లు నిర్ధారించింది. ప్లాట్ల కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే మాదిరి బాన్సువాడ పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో భారీగా నాన్లేఅవుట్ వెంచర్లు వెలిశాయి. వాటిలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేపట్టారు. రెండేళ్ల కిందట బాన్సువాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్ను సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కామారెడ్డి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక వర్గానికి చెందిన స్థిరాస్తి వ్యాపారుల నాన్లేఅవుట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపిస్తూ మరో వర్గానికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సబ్రిజిస్ట్రార్ను బదిలీ చేశారు. ఇప్పటికీ కామారెడ్డి, బాన్సువాడలతో పాటు ఎల్లారెడ్డి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నాన్లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్ఏ సర్వేపై ఉపాధ్యాయులకు శిక్షణ
[ 27-07-2024]
జాతీయ సాధన సర్వే (నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే) 2024 లో భాగంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్