అనుమతులు ఉండవు.. చర్యలు కరవు
‘‘జిల్లా కేంద్రంలోని ఆరు బడులకు విద్యాశాఖ నుంచి అనుమతి లేదు. ఇందులో ప్రవేశాలు పొంది భవిష్యత్తును పాడుచేసుకోవద్దు.
జిల్లాలో యథేచ్ఛగా ప్రైవేటు బడుల ఏర్పాటు
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం: ‘‘జిల్లా కేంద్రంలోని ఆరు బడులకు విద్యాశాఖ నుంచి అనుమతి లేదు. ఇందులో ప్రవేశాలు పొంది భవిష్యత్తును పాడుచేసుకోవద్దు. అధికారుల సూచనలు పొందాకే బడుల్లో చేర్పించాలి’’. ఇది తాజాగా అధికారులు విడుదల చేసిన ప్రకటన. కానీ అనుమతులు లేని విద్యాసంస్థలను కట్టడి చేయాల్సిన యంత్రాంగం అందుకు భిన్నంగా చోద్యం చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వచ్చే నెల 12వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తల్లిదండ్రులు పిల్లలను బడుల్లో చేర్పించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. జిల్లాకేంద్రంలో పదుల సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేట్ బడులు వెలుస్తున్నాయి. విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే కొన్ని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యాజమాన్యాల ప్రతినిధులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పిల్లల తల్లిదండ్రులను కలుస్తూ తమ బడుల్లో చేర్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అనుమతులు లేని బడులను గుర్తించి చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు భావిస్తున్నారు.
ఫిర్యాదు వస్తేనే హడావుడి
విద్యాసంవత్సరం ప్రారంభంలో తనిఖీలు చేసి అనుమతులు లేని విద్యాలయాలను నియంత్రించాల్సి ఉంది. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థిసంఘాల నాయకులు, ఇతరులు ఫిర్యాదు చేస్తేనే తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ప్రమాణాలకు భిన్నంగా..
జిల్లాలో ప్రాథమిక తరగతుల నిర్వహణతో పాటు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతి తప్పనిసరని 2015లో సర్కారు పేర్కొంది. ప్రైవేటు విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. కానీ బడుల యాజమాన్యాలు విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోవడం లేదు. మే నెలలో విద్యాసంస్థలను ఏర్పాటుచేసి ప్రవేశాలు కల్పించి విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం చేస్తూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. విద్యార్థులకు చదువు అర్హత పత్రాలను మరో పాఠశాల నుంచి తెప్పించి ఇస్తున్నారు.
వివరాలు తెలుసుకొని చేర్పించాలి
బడులకు సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకున్నాకే పిల్లలను అందులో చేర్పించాలి. అనుమతి లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు అధికారులను సంప్రదించాకే బడుల్లో ప్రవేశాలు తీసుకోవడం ఉత్తమం.
- రాజు, డీఈవో, కామారెడ్డి
జిల్లాలో.. : ప్రైవేటు బడులు : 168 అనుమతి లేనివి(సుమారు) : 40 అధికారులు గుర్తించినవి : 10
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగు మారిన మిషన్ భగీరథ నీరు
[ 27-07-2024]
మండలంలోని తాండూర్ గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్భగీరథ నీరు కలుషితంగా వస్తోంది. -
ఎన్ఏ సర్వేపై ఉపాధ్యాయులకు శిక్షణ
[ 27-07-2024]
జాతీయ సాధన సర్వే (నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే) 2024 లో భాగంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి