logo

పండరీపూర్‌ ప్యాసింజర్‌ తాత్కాలికంగా రద్దు

నిజామాబాద్‌ - జానకంపేట మధ్యలో రైల్వే ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా నిజామాబాద్‌ నుంచి పండరీపూర్‌ వెళ్లే ప్యాసింజర్‌ రైలును మంగళవారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 28 May 2024 02:11 IST

ఇందూర్‌ సిటీ, న్యూస్‌టుడే : నిజామాబాద్‌ - జానకంపేట మధ్యలో రైల్వే ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా నిజామాబాద్‌ నుంచి పండరీపూర్‌ వెళ్లే ప్యాసింజర్‌ రైలును మంగళవారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి యథావిధిగా నడుస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని సూచించారు.


కొనసాగుతున్న సర్వే

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో ఇళ్ల నిర్మాణాల కొలతలకు సంబంధించి చేపట్టిన సర్వే కొనసాగుతోంది. మే 1 నాటికి పూర్తిస్థాయి లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావించినా సాధ్యపడలేదు. మొదట వాణిజ్య భవనాలకు సంబంధించిన కొలతలను మాత్రమే సిబ్బంది స్వీకరించారు. ఏడు వేల నిర్మాణాలను గుర్తించారు. అనంతరం ఇళ్ల కొలతలపై దృష్టి పెట్టి 8 వేల నిర్మాణాల సర్వే పూర్తిచేసినట్లు పురపాలక రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని