జీలుగ.. లేదుగా
నేలలో భూసారం పెంచుకునేందుకు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట వేసుకోవాలనే లక్ష్యం జిల్లాలో నీరుగారిపోతోంది.
పచ్చిరొట్ట విత్తనాల కొరత
అదను దాటుతుందని రైతుల ఆవేదన
పంపిణీకి సిద్ధంగా ఉన్న బస్తాలు
న్యూస్టుడే, నిజామాబాద్ వ్యవసాయం: నేలలో భూసారం పెంచుకునేందుకు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట వేసుకోవాలనే లక్ష్యం జిల్లాలో నీరుగారిపోతోంది. సాగుకు రైతుల నుంచి మంచి స్పందన ఉన్నప్పటికీ సరఫరా చేయడంలో వ్యవసాయశాఖ విఫలమవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు భిన్నంగా జిల్లాలో నెల రోజుల ముందే సాగు కార్యాచరణ ప్రారంభమవుతుంది. బోధన్ డివిజన్లో ఇప్పటికే నార్లు పోసి పక్షం రోజులవుతోంది. చాలాచోట్ల ఇప్పుడిప్పుడే నారుమడులు సిద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పచ్చిరొట్ట ఎరువులు నెల రోజుల ముందే సమకూర్చాలి. స్థానిక డిమాండ్ దృష్ట్యా వారం కిందట వచ్చిన అరకొర విత్తనాలు రైతుల అవసరాలు తీర్చలేకపోయాయి. మిగతా విత్తనాలు ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నారు.
మరో 5 వేల క్వింటాళ్లు వచ్చినా సరిపోదు
జిల్లాలో వానాకాలం సీజన్లో 5.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా వరి ఒక్కటే 4.30 లక్షల ఎకరాల్లో ఉండనుంది. నిస్సారమైన నేలలున్న చోట పచ్చిరొట్ట ఎరువులు వేసేందుకు రైతులు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చౌడు నేలల్లో వీటి అవసరం తప్పనిసరి. వాస్తవానికి వరి నాట్లేసే ముందు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువులేసి కలియదున్నితే నత్రజని (యూరియా) ఎరువుల వినియోగం తగ్గుతుంది. జిల్లాకు కనీసంగా 40 వేల క్వింటాళ్ల విత్తనం అవసరం. అందరు ఆసక్తి చూపరనే భావించి వ్యవసాయశాఖ అత్యవసరంగా 8,500 క్వింటాళ్లకు ప్రతిపాదించింది. కానీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కేవలం 5,235 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసింది. ఇంకా 3,265 క్వింటాళ్లు రావాల్సి ఉంది. సకాలంలో విత్తనం అందుబాటులో ఉంటే మరో 5 వేల క్వింటాళ్లు వచ్చినా సరిపోయే పరిస్థితి లేదు.
అడిగే వారుండరు
పచ్చిరొట్ట విత్తనాల్లో ఎక్కువగా వినియోగించేది జీలుగ. వీటిని విత్తి పెంచి తుంచాలంటే కనీసం 45 రోజులు పడుతుంది. మరో వారంలో జిల్లాకు రుతుపవనాలు రానున్నాయని వాతావరణ శాఖ సూచనతో రైతులు ఇప్పటికే నారు మడులు సిద్ధం చేసుకున్నారు. ఓ పది శాతం నార్లు పోయడం పూర్తయింది. బోధన్, వర్ని, రుద్రూర్, చందూర్ మండలాల్లో కొన్నిచోట్ల నార్లు పోసి పది రోజులైపోయింది. కానీ, ఇప్పటివరకు జీలుగ విత్తనాలు సరఫరా పూర్తికాలేదు. ఈ వారం రోజుల్లో అందితేనే విత్తులు చల్లుకునే వీలుంటుంది. లేదంటే అదను దాటిందని రైతులు వాటి జోలికి వెళ్లరు. రాజస్థాన్, హరియాణా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతిపై ఆధారపడాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సరఫరాలో జాప్యం నెలకొని రైతులు విత్తనాల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది.
వారం, పది రోజుల్లో వస్తాయి
- వాజీద్ హుస్సేన్, జిల్లా వ్యవసాయాధికారి
నిస్సారమైన నేలలు కాపాడుకునేందుకు కర్షకుల్లో వచ్చిన చైతన్యంతో డిమాండ్ పెరిగింది. సాగుదారులు విత్తనం కోసం అధైర్యపడొద్దు. ఇప్పటివరకు సొసైటీలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా 4,270 క్వింటాళ్ల జీలుగ పంపిణీ చేశాం. మరో 3,300 క్వింటాళ్ల్లు రావాల్సి ఉంది. ఇంకా ఎక్కడైన అవసరముంటే ఏవోల ద్వారా సమీక్షిస్తున్నాం. మరో వారం, పది రోజుల్లో విత్తనాలు వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే