అక్షిత ఉపన్యాస దక్షత
ఆ విద్యార్థిని చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అనారోగ్యంతో సోదరుడూ మృతిచెందాడు. అయినా ఆత్మస్థైర్యంతో చదువుతో పాటు వివిధ విభాగాల్లో రాణిస్తోంది.
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం
వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో అక్షిత
ఆ విద్యార్థిని చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అనారోగ్యంతో సోదరుడూ మృతిచెందాడు. అయినా ఆత్మస్థైర్యంతో చదువుతో పాటు వివిధ విభాగాల్లో రాణిస్తోంది. ఈ నెల 19న పార్లమెంటు ప్రాంగణంలో హిందీలో ఉపన్యసించి ప్రతిభ చాటింది గిరిరాజ్ కళాశాల విద్యార్థిని అక్షిత. డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉపన్యాసం, నృత్యం, పాటలు, చదరంగం, వాలీబాల్ తదితర క్రీడల్లో సత్తాచాటింది.
ఉపన్యాస పోటీల్లో జాతీయస్థాయికి..
ఈ ఏడాదిలో నెహ్రూ యువకేంద్రం నిజామాబాద్ వారు జిల్లాస్థాయిలో హిందీ దివస్ సందర్భంగా భాష విశిష్టతపై నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో 20 మంది పాల్గొనగా అక్షిత ప్రథమ స్థానంలో నిలిచింది. అనంతరం హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంశంపై 29 మంది పాల్గొంటే అందులోనూ మొదటిస్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికైంది. పార్లమెంటు ప్రాంగణంలో మాజీ ప్రధాని ‘ఇందిరాగాంధీ జీవితం’ అనే అంశంపై మాట్లాడి జాతీయ స్థాయిలో పురస్కారం దక్కించుకుంది.
సాధించిన విజయాలు..
* 2020లో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో జరిగిన పాటల పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం.
* 2020లో ఎన్వైకే ఆధ్వర్యంలో నిజామాబాద్లో జరిగిన జిల్లాస్థాయి నృత్య పోటీల్లో ప్రతిభ.
* 2020లో రాష్ట్రస్థాయి యువ కళాకారిణిగా పురస్కారం.
* 2021లో వాలీబాల్, చదరంగం పోటీల్లో కళాశాల స్థాయిలో మూడుసార్లు బహుమతులు సొంతం.
* 2022లో ఎన్వైకే నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆరుసార్లు బహుమతులు.
* 2022 నవంబరు 19న దిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఉపన్యసించి ప్రత్యేక పురస్కారం అందుకుంది.
సొంతంగా సాధన చేశా
- అక్షిత, నిజామాబాద్
నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ రంగాల్లో రాణించాలని ఉండేది. అందుకే సొంతంగా సాధన చేశాను. మా అమ్మ అంగన్వాడీ టీచర్. ఎప్పుడూ వెన్నుతడతారు. ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా యువజన అధికారి ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మరిచిపోలేను. మరింత సాధన చేసి అంతర్జాతయ స్థాయిలో ఉత్తమ కళాకారిణిగా గుర్తింపు సాధిస్తా. ఐపీఎస్ అధికారిణి కావాలనే లక్ష్యం పెట్టుకున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!