తెరపైకి మరో మండలం
కొత్త మండలాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇటీవలే కోటగిరి మండలంలోని పొతంగల్ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
హన్మాజిపేట్ ఏర్పాటుకు రంగం సిద్ధం!
న్యూస్టుడే, బాన్సువాడ
ప్రధాన కూడలి
కొత్త మండలాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇటీవలే కోటగిరి మండలంలోని పొతంగల్ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. తాజాగా బాన్సువాడలో హన్మాజిపేట్ తెరపైకి వచ్చింది. స్థానికుల విజ్ఞప్తి మేరకు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామాల తీర్మాన కాపీలు, జనాభా ఇతర వివరాలను పంపించాలని ఆయా జిల్లాల పాలనాధికారుల నుంచి స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు అందాయి. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
11 గ్రామాలతో..
బాన్సువాడ మండలంలో మొత్తం 25 పంచాయతీలు. మండలకేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మాజిపేట్ను ఏర్పాటు చేయాలని గతంలో ఆలోచన చేసినా.. ఆయా గ్రామాల సహకారం లేకపోవడంతో అడుగు ముందుకు పడలేదు. ఇటీవల పొతంగల్ ఏర్పాటుతో మరోసారి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిసింది.
ఈ గ్రామాలతోనే..
కొత్త మండలంలో బాన్సువాడ నుంచి హన్మాజిపేట్తోపాటు కోనాపూర్, ఖాద్లాపూర్, సంగోజిపేట్, సోమ్లనాయక్తండా, పులిగుచ్చతండా, వర్ని మండలం నుంచి పైడిమల్, చింతల్పేట్, చిలుకతండా, గోకుల్దాస్తండా, సిద్ధాపూర్తండాను చేర్చాలని భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నారు.
మొత్తం ఐదు..
బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. వర్నిలో మోస్రా, చందూర్, రుద్రూర్, కోటగిరిలో పొతంగల్, బీర్కూరులో నస్రుల్లాబాద్ నూతన మండలాలుగా కొలువుదీరాయి. హన్మాజిపేట్ ఏర్పాటైతే.. పాత బాన్సువాడ, బీర్కూరు, కోటగిరి, వర్నితో కలిపి మండలాల సంఖ్య 10కి చేరనుంది.
వివరాలు అడిగారు
గంగాధర్, తహసీల్దార్, బాన్సువాడ
హన్మాజిపేట్తోపాటు మరో ఐదు గ్రామాల వివరాలను కలెక్టర్ అడిగారు. తీర్మాన కాపీలు పంపిస్తున్నాం. కొత్త మండలం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికంగా అభివృద్ధి
- బోనాల సుభాష్, సర్పంచి, హన్మాజిపేట్
హన్మాజిపేట్ మండలంగా ఏర్పాటైతే ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇందుకు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి కృషి చేస్తారని భావిస్తున్నాం. ఇప్పటికే తీర్మానం చేసి అధికారులకు ఇచ్చాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్