తెరపైకి మరో మండలం
కొత్త మండలాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇటీవలే కోటగిరి మండలంలోని పొతంగల్ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
హన్మాజిపేట్ ఏర్పాటుకు రంగం సిద్ధం!
న్యూస్టుడే, బాన్సువాడ
ప్రధాన కూడలి
కొత్త మండలాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇటీవలే కోటగిరి మండలంలోని పొతంగల్ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. తాజాగా బాన్సువాడలో హన్మాజిపేట్ తెరపైకి వచ్చింది. స్థానికుల విజ్ఞప్తి మేరకు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామాల తీర్మాన కాపీలు, జనాభా ఇతర వివరాలను పంపించాలని ఆయా జిల్లాల పాలనాధికారుల నుంచి స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు అందాయి. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
11 గ్రామాలతో..
బాన్సువాడ మండలంలో మొత్తం 25 పంచాయతీలు. మండలకేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మాజిపేట్ను ఏర్పాటు చేయాలని గతంలో ఆలోచన చేసినా.. ఆయా గ్రామాల సహకారం లేకపోవడంతో అడుగు ముందుకు పడలేదు. ఇటీవల పొతంగల్ ఏర్పాటుతో మరోసారి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిసింది.
ఈ గ్రామాలతోనే..
కొత్త మండలంలో బాన్సువాడ నుంచి హన్మాజిపేట్తోపాటు కోనాపూర్, ఖాద్లాపూర్, సంగోజిపేట్, సోమ్లనాయక్తండా, పులిగుచ్చతండా, వర్ని మండలం నుంచి పైడిమల్, చింతల్పేట్, చిలుకతండా, గోకుల్దాస్తండా, సిద్ధాపూర్తండాను చేర్చాలని భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నారు.
మొత్తం ఐదు..
బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. వర్నిలో మోస్రా, చందూర్, రుద్రూర్, కోటగిరిలో పొతంగల్, బీర్కూరులో నస్రుల్లాబాద్ నూతన మండలాలుగా కొలువుదీరాయి. హన్మాజిపేట్ ఏర్పాటైతే.. పాత బాన్సువాడ, బీర్కూరు, కోటగిరి, వర్నితో కలిపి మండలాల సంఖ్య 10కి చేరనుంది.
వివరాలు అడిగారు
గంగాధర్, తహసీల్దార్, బాన్సువాడ
హన్మాజిపేట్తోపాటు మరో ఐదు గ్రామాల వివరాలను కలెక్టర్ అడిగారు. తీర్మాన కాపీలు పంపిస్తున్నాం. కొత్త మండలం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికంగా అభివృద్ధి
- బోనాల సుభాష్, సర్పంచి, హన్మాజిపేట్
హన్మాజిపేట్ మండలంగా ఏర్పాటైతే ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇందుకు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి కృషి చేస్తారని భావిస్తున్నాం. ఇప్పటికే తీర్మానం చేసి అధికారులకు ఇచ్చాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే