ప్రభుత్వమే చర్యలకు ఉపక్రమించాలి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత ఏడాదిన్నర కాలంగా బడ్జెట్ ఆమోదం లేకుండా జరిగిన వ్యయాలు, అక్రమ నియామకాలు, నిబంధనల ఉల్లంఘనలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వమే చర్యలకు ఉపక్రమించాలని పాలక మండలి సభ్యులు తీర్మానించారు.
రిజిస్ట్రార్గా ఆచార్య యాదగిరి పునర్నియామకం
తెవివి పాలక మండలి భేటీలో నిర్ణయం
హైదరాబాద్లో పాలక మండలి సమావేశానికి హాజరైన విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్, సభ్యులు
న్యూస్టుడే, తెవివి క్యాంపస్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత ఏడాదిన్నర కాలంగా బడ్జెట్ ఆమోదం లేకుండా జరిగిన వ్యయాలు, అక్రమ నియామకాలు, నిబంధనల ఉల్లంఘనలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వమే చర్యలకు ఉపక్రమించాలని పాలక మండలి సభ్యులు తీర్మానించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉండటంతో హైదరాబాద్లో గురువారం ఈసీ సమావేశం రెండు దఫాలుగా జరిగింది. మొదట రూసా భవనంలో నవీన్ మిత్తల్తో సభ్యులు భేటీ అయ్యారు. సాయంత్రం సచివాలయ బ్లాకులో జరిగిన సమావేశానికి వాకాటి కరుణ ఛైర్పర్సన్గా వ్యవహరించారు. వసుంధరాదేవి, గంగాధర్గౌడ్, మారయ్యగౌడ్, ప్రవీణ్, నసీం, రవీందర్రెడ్డి హాజరయ్యారు. రిజిస్ట్రార్గా ఆచార్య యాదగిరినే పునర్నియమిస్తున్నట్లు ఈసీ సభ్యులు తీర్మానించారు.
పాలక మండలి సమావేశాల్లో తాము తీసుకుంటున్న తీర్మానాలు అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొందని సభ్యులు గట్టిగా నొక్కి చెప్పినట్లు తెలిసింది. తొందరపాటు వద్దని, వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారికి విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యా కమిషనర్ సర్ది చెప్పినట్లు సమాచారం. ఈసీ సమావేశం మళ్లీ జూన్ 3వ తేదీన జరపాలని నిర్ణయించారు.
గత అంశాలపైనే చర్చ
గత నెల 19 తేదీ నుంచి వరుసగా జరిగిన అయిదు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈసీ తీర్మానం లేకుండా రిజిస్ట్రార్ల నియామకం, నిధుల దుర్వినియోగం, సిబ్బంది నియామకంలో, పదోన్నతుల్లో వసూళ్ల ఆరోపణలపై చర్చించారు. పీహెచ్డీ పట్టాల జారీలో నిబంధనల ఉల్లంఘనలపై వేసిన కమిటీ విచారణకు ముందడుగు పడని పరిస్థితులు నెలకొన్నాయని, నిధుల దుర్వినియోగంపై ఏసీబీ, విజిలెన్స్తో విచారణ జరిపించాలని గతంలో నిర్ణయించిన తీర్మానాల అమలు అంశాలను సభ్యులు గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి