సీపీ గారూ.. బాల చోదకులను నియంత్రించరూ..!
గతేడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు ఒక విద్యార్థి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. మోర్తాడ్ దగ్గర అదుపు తప్పి చెట్టుకు ఢీకొని మృతి చెందాడు.
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్
క్షోభ మిగిల్చిన ఘటనలు
గతేడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు ఒక విద్యార్థి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. మోర్తాడ్ దగ్గర అదుపు తప్పి చెట్టుకు ఢీకొని మృతి చెందాడు.
- ఈ ఏడాది ఫిబ్రవరి 20న పిట్లం నుంచి ఇంటర్ విద్యార్థి తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బాన్సువాడకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లే సమయంలో బాన్సువాడ పట్టణంలోనే బస్సు కింద పడి మృతి చెందగా స్నేహితుడికి గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలు వారి వారి కుటుంబాలకు ఎంత క్షోభను మిగిల్చి ఉంటాయో తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి.
శ్రీయుత గౌరవనీయులైన పోలీసు కమిషనర్ గారికి,
సార్.. మేము బాల వాహన చోదకుల బాధితులం. గల్లీలు, ప్రధాన రహదారుల్లో బాలలు రయ్యున వాహనాలతో దూసుకొస్తుండటంతో భయభ్రాంతులకు గురవడంతో పాటు ప్రమాదాల బారిన పడుతున్నాం. దీంతో మాలాంటి వారంతా చర్చించుకుని బాల డ్రైవర్ల నియంత్రణకు మీకో అప్పీలు చేద్దామని లేఖ రాస్తున్నాం. నియంత్రణ మీ ఒక్కరి బాధ్యతే అని కాదు. కానీ ఖాకీ యూనిఫాం, చట్టాలు అంటే గౌరవం, గుర్తుకొచ్చే క్రమశిక్షణ.. ఇవన్నీ బాలురను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతుందనే ఆశతో ఉన్నాం. జిల్లాలో ఇంటర్, పదో తరగతి విద్యార్థులు దాదాపు 20 వేల వరకు ఉన్నారు. వారిలో ఐదు శాతం మంది వాహనాలు తీసుకుని బయటకు వస్తే వెయ్యి బండ్లు రహదారులపై చక్కర్లు కొడుతున్నట్టు లెక్క.
వయసుకు మించిన వాహనాలు..
ప్రస్తుతం పది, ఇంటర్ పరీక్షలు ముగియడంతో వారు తమ వయసుకు మించిన వాహనాలు నడుపుతున్నారు. అది వారికి ఆనందం కలిగించినా.. ఎదుటి వారి ఆనందాన్ని హరించే పరిస్థితులు ఉంటున్నాయి. ద్విచక్ర వాహనాలే కాదు కార్లు సైతం తోలుతూ రోడ్లపై ప్రజలను హడలెత్తిస్తున్నారు. వారిని ఆపేవారెవరూ?.. బాధ్యత తెలిపేవారు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లేదు. అందుకే తనిఖీలు చేస్తూ, చలానాలు వేస్తూ వాహనదారులకు బాధ్యత గుర్తు చేస్తున్న పోలీసుశాఖనే బాలలను నియంత్రించడానికి సరైందని భావిస్తున్నాం. ఇప్పటికే 7-9వ తరగతి విద్యార్థులు పాఠశాలకు ద్విచక్ర వాహనాలపై వస్తుండటం గమనార్హం. కొన్ని ప్రైవేటు బడులను తనిఖీ చేస్తే పిల్లలు తీసుకొచ్చిన వాహనాలు పదుల సంఖ్యలో పార్కింగ్ చేసి కనిపిస్తాయి. విద్యార్థులకు అనుమతి లేకపోవడం, అతివేగం, ఆపై పరిమితికి మించి నలుగురైదుగురు ప్రయాణం, ఇంకా సాహసాలు చేయడం, సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దాలు చేయడం, అర్ధరాత్రి వరకు తిరగడం.. వంటి చర్యలతో మోటారు వాహన నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వద్దని ఎవరు చెప్పినా వారితో వాదన, ఘర్షణకు దిగుతున్నారు. వారి ద్వారా ఎదుటి వాహనదారుడు ప్రమాదానికి గురై మరణిస్తే అతని కుటుంబం పరిస్థితి ఎలా? అనే స్పృహ వారిలో కలిగించేందుకు చట్టం నిర్దేశించిన కాఠిన్యం చూపాలని కోరుతున్నాం.
తల్లిదండ్రులూ.. ఆలోచించాల్సిందే..
తమ పిల్లలు వాహనం నడుపుతున్నారని ఉప్పొంగిపోయే తల్లిదండ్రులు ఆ వాహనం నడపడంపై వారికున్న అవగాహన ఎంత?, మన సమక్షంలో, మనం లేని సమయంలో ఎలా నడిపిస్తున్నాడు? అనే విషయాలు గమనించాలి. వారి వయసుకు పరిమిత విచక్షణ ఉంటుంది. రోడ్డుపై దూసుకెళ్లడం తప్ప ప్రమాదాలకు గురైతే ఏంటి పరిస్థితి? అనే ఆలోచన ఉండదు. వాస్తవానికి పోలీసులు వాహనం నడిపే పిల్లలపై కేసులు పెట్టాలంటే.. లైసెన్సు లేకుండా నడపడం, అతివేగం, శబ్ద కాలుష్యం, నంబరు ప్లేటులో లోపాలు, మత్తు పదార్థాలు దొరికితే.. ఇలా బండి తోలిన వ్యక్తితో పాటు యజమానిపైనా దాదాపు పది రకాల కేసులు నమోదు చేయొచ్చు. అలా చేస్తే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అనే ఉద్దేశంతో పోలీసులు ఉంటే బాలురు వారిని, నియమాలను తేలికగా తీసుకుంటున్నారు. రవాణా శాఖ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేస్తే వాహనదారులకు రూ.25వేల వరకు జరిమానాలు విధించవచ్చట. ఇక మోటారు వాహన చట్టం, పోలీసుశాఖ ఐపీసీ (న్యాయ సంహిత) సెక్షన్ల కింద కేసులవుతాయి. వీటి ఆధారంగా చూస్తే కనీసం మూడు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని పిల్లలకు వాహనాలు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండండి.
ఇట్లు : బాల వాహన చోదకుల బాధితులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి