logo

Odisha: ప్రసవ వేదనతో 2 కిమీ.. నడిచిన మహిళ

మల్కాన్‌గిరి జిల్లాలో ప్రసవ వేదనతో రేండు కిలోమీటర్లు నడుచుకోని ఆసుపత్రికి వెల్లే దృశ్యం చోటు చేసుకుంది.

Published : 27 May 2024 16:11 IST

మల్కాన్‌గిరి: మల్కాన్‌గిరి జిల్లాలో ప్రసవ వేదనతో రేండు కిలోమీటర్లు నడుచుకోని ఆసుపత్రికి వెల్లే దృశ్యం చోటు చేసుకుంది. ఇంతక ముందు కుడా చాలాసార్లు అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, ప్రసవ వెదనతో బాధపడుతున్న మహిళలు నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లేవారు. వివరాలకు వస్తే గదిగుడ గ్రామానికి చెందిన మధు ముదులి భార్య ప్రతిమా ముదులికి సోమవారం ఉదయం ప్రసవ వేదన ప్రారంభమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆంబులెన్సుకు ఫోన్ చేసిన తరువాత గ్రామానికి రహదారి లేకపోవడం వల్ల రెండు కిలోమీటర్ల దూరంలో వున్న ముఖ్య రహదారి వద్ద ఆంబులెన్స్‌ ఆగిపోయింది. కాని తప్పని సరి పరిస్థితిలో నడుచుకోని అంబులెన్సు దగ్గరికి చేరుకుంది. అక్కడ నుంచి ఆమేకు కుడుములుగుమ్మ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని