Odisha: నదిలో రబ్బరు ట్యూబుపై రోగి తరలింపు
కొంధమాల్ జిల్లా బలిగుడ ఠాణా పరిధిలో మహాసింఘ్ పంచాయతీలోని కుబేరముండా గ్రామానికి చెందిన అనంతి ప్రధాన్ (45) అనే రోగిని భర్త రఘునాథ ప్రధాన్, ఇతర కుటుంబ సభ్యులు రబ్బరు ట్యూబుపై ఖడ్గ నదిని దాటించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్్ అయింది.
రబ్బరు ట్యూబుపై రోగిని తరలిస్తున్న గ్రామస్థులు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: కొంధమాల్ జిల్లా బలిగుడ ఠాణా పరిధిలో మహాసింఘ్ పంచాయతీలోని కుబేరముండా గ్రామానికి చెందిన అనంతి ప్రధాన్ (45) అనే రోగిని భర్త రఘునాథ ప్రధాన్, ఇతర కుటుంబ సభ్యులు రబ్బరు ట్యూబుపై ఖడ్గ నదిని దాటించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్్ అయింది. అనంతి నాలుగు రోజులుగా అతిసారంతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. మహాసింగ్కు ఆమెను తరలించాలంటే గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న ఖడ్గ నది దాటాల్సిందే. నదిపై వంతెన లేకపోవడంతో ఆమెను రబ్బరు ట్యూబుపై ఉంచి భర్త, ఇతరులు ఇటీవల నదిని దాటారు. అనంతరం మహాసింఘ్ నుంచి ఆమెను అంబులెన్స్లో బలిగుడలోని ఆసుపత్రికి తరలించారు. కుబేరముండా గ్రామంలో పదిహేను కుటుంబాలు ఉన్నాయి. వారంతా ఖడ్గ నది నీటిలో రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో నదిలో నీటి ప్రవాహం పెరిగితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నది మీదుగా మహాసింఘ్కు రెండు కి.మీ. దూరం ఉండగా, కె.నువాగాంకు వెళ్లేందుకు చుట్టూ తిరిగి 22 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వారు ప్రమాదమని తెలిసినా నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఖడ్గ నదిపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
రోగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లలో 628 మంది దుర్మరణం
[ 27-07-2024]
ఒడిశాలో గజరాజుల దాడిలో గత ఐదేళ్లలో 628 మంది దుర్మరణం చెందారు. -
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు