ఇంటికి పిలిచి.. సన్నిహితంగా ఉన్నట్లు నటించి..
ఫేస్బుక్ ద్వారా యువకులతో స్నేహం పెంచుకొని తర్వాత వారిని ఇంటికి పిలిచి దాడి చేసి వారి వద్దనున్న బంగారం, నగదు దోచుకుంటున్న ముఠాకు చెందిన నలుగురిని భువనేశ్వర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
దోచుకుంటున్న ముఠా అరెస్టు
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: ఫేస్బుక్ ద్వారా యువకులతో స్నేహం పెంచుకొని తర్వాత వారిని ఇంటికి పిలిచి దాడి చేసి వారి వద్దనున్న బంగారం, నగదు దోచుకుంటున్న ముఠాకు చెందిన నలుగురిని భువనేశ్వర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీసీపీ ప్రతీక్ సింగ్ విలేకరులకు అందించిన వివరాల ప్రకారం... భువనేశ్వర్ తమాండొ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై దర్యాప్తు జరిపి ఈ ముఠాను అరెస్టు చేశారు. ఇరానీ పాత్ర్ అనే మహిళ, ఆమె భర్త రవి పాత్ర్ ముఠాలో ప్రధాన పాత్ర పోషించేవారు. ఇరానీ పాత్ర్ తన ఫొటోలను పేస్బుక్లో ఉంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపేది. దానిని అంగీకరించినవారి ఫోన్ నెంబరు తీసుకొని రెచ్చగొట్టే మెసేజ్లు పంపేది. తర్వాత వారికి ఇంటికి పిలిచేది. అలా వెళ్లిన యువకుడ్ని ఏసీ గదిలో కూర్చోబెట్టేది. తర్వాత ఆయనతో కొంత సన్నిహితంగా ఉన్నట్లు నటించేది. అప్పటికే అక్కడున్న ఇద్దరు యువకులు రహస్యంగా ఈ దృశ్యాలను చిత్రీకరించేవారు. తర్వాత వారిద్దరూ వచ్చి ఆయనను మారణాయుధాలతో బెదిరించి బంగారం, డబ్బు దోచుకొనేవారు. మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి మరికొంత తీసుకునేది. భువనేశ్వర్కి చెందిన యువకుని భార్యకు ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.3.60 లక్షలు కాజేసినట్లు మరో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు ముఠాను అరెస్టు చేయడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో వీరిపై నమోదైన కేసులు వెలుగులోకి వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్