IT Raids: ఆగని ఐటీ దాడులు.. సంచుల కొద్దీ డబ్బు
ఒడిశాలో అయిదు రోజులుగా ఆదాయం పన్ను అధికారులు నాటుసారా తయారు చేసి విక్రయించేవారి ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: ఒడిశాలో అయిదు రోజులుగా ఆదాయం పన్ను అధికారులు(IT Raids) నాటుసారా తయారు చేసి విక్రయించేవారి ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో దాడులు నిర్వహించి రూ.225 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ప్రజల సొమ్ము దోచుకున్న వారి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి ప్రజలకు చేరుస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో అధికారులు దాడులు ముమ్మరం చేశారు.
156 సంచుల నగదు వెలికితీత: శుక్రవారం రాత్రి బొలంగీర్ జిల్లా సుధారపడ ప్రాంతంలో నాటు సారా తయారుచేసే సంస్థ మేనేజర్ ఇంటిలో సోదాలు నిర్వహించి భారీగా డబ్బు వెలికితీసి 20 సంచుల్లో ఉంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న ధనాన్ని 156 సంచుల్లో వేసి ఈ మొత్తాన్ని ఎస్బీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బ్యాంకులో ఉన్న నోట్ల లెక్కింపు యంత్రాలతోపాటు ఇతర బ్రాంచుల్లో ఉన్న యంత్రాలనూ తీసుకొచ్చి శనివారం లెక్కించారు.
అక్రమ నగదు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ స్వాధీనం చేసుకున్నది అక్రమ నగదు అని, ఇది భారీ మొత్తంలో రికవరీ కావడం ఆందోళన కలిగించే విషయమన్నారు.
రాష్ట్రంలో ప్రముఖ నాటు సారా వ్యాపారిగా గుర్తింపున్న బొలంగీర్కు చెందిన బల్దేవ్ సాహుకు సంబంధించిన సంస్థలోను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బొలంగీర్తోపాటు సంబల్పూర్, రవుర్కెలా, భువనేశ్వర్, సుందర్గఢ్ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.65 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్
[ 26-07-2024]
భాజపా ప్రభుత్వం తొలిసారిగా గురువారం రాత్రి శాసనసభలో 2024 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి రూ.2.65 లక్షల కోట్లతో బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టారు. -
ఆర్థికాభివృద్ధి రేటు 8.5
[ 26-07-2024]
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, 2023-24 ఆర్థికాభివృద్ధి రేటు 8.5 శాతంగా ఉందని ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. గతేడాది (2022-23) ఆర్థికాభివృద్ధి రేటు 7.9 శాతంగా నమోదైందని వివరించింది. -
అమ్మా... అని పిలిచేవారే లేకుండా పోయారు
[ 26-07-2024]
అమ్మా...! చూడు చెల్లి కొడుతోంది..చూడమ్మా అక్క రిమోట్ ఇవ్వడం లేదు..తమ్ముడు హోంవర్కు చేయడం లేదమ్మా... ఇలాంటి ఫిర్యాదులు అన్ని ఇళ్లలో వినిపిస్తుంటాయి. -
పోలవరంతో రాష్ట్రానికి నష్టం
[ 26-07-2024]
శాసనసభ శూన్య గంట (జీరో అవర్)లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సభాపక్షం (సీఎల్పీ) నేత రామచంద్ర కడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వల్ల దక్షిణ ఒడిశా జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, గ్రామాలు మునిగిపోతాయన్నారు. -
విజిలెన్స్ వలలో చిక్కిన ప్రధాన ఇంజినీరు
[ 26-07-2024]
బొలంగీర్ జిల్లా కేంద్రం పరిధిలోని లోయర్ సుక్తేల్ నీటి పారుదల ప్రాజెక్టు ప్రధాన ఇంజినీరు సునీల్రౌత్ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆదాయానికి మించి పదిరెట్లు ఆస్తులు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బొలంగీర్ జిల్లా కేంద్రం పరిధిలోని లోయర్ సుక్తేల్ నీటి పారుదల ప్రాజెక్టు ప్రధాన ఇంజినీరు సునీల్రౌత్ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆదాయానికి మించి పదిరెట్లు ఆస్తులు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. -
రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
[ 26-07-2024]
మోహన పోలీసులు రూ.30 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహన ఠాణా పరిధిలో గురువారం సాయంత్రం ఎస్.ఐ. సౌమ్యరంజన్ బోరాల్ తన బృందంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సికులిపొదర్ ప్రాంతంలో కారు, ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించగా గంజాయి లభ్యమైంది. -
కేంద్రపడలో నక్కల బెడద
[ 26-07-2024]
కేంద్రపడ జిల్లా మర్సఘాయ్ సమితిలోని పలు గ్రామాల్లో గత కొద్ది రోజులుగా నక్కల బెడద ఎక్కువవుతోంది. ఇప్పటికే వీటి దాడిలో 25 మందికిపైగా గాయపడగా, బుధవారం ఓ మహిళ మృతి చెందింది.