స్తంభానికి కట్టి.. తల్లిని కొట్టి.. అమానుషంగా ప్రవర్తించిన కుమారుడు
తల్లిదండ్రులు తమ బిడ్డలను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. వారు చిన్నప్పుడు గుండెలపై తంతే మురిసిపోతారు. బుడిబుడి అడుగులు వేస్తుంటే చేయి పట్టి నడిపిస్తారు. వారు పెద్దయ్యాక తమ బాధలు దూరమవుతాయని కలలు కంటారు.
కటక్, న్యూస్టుడే: తల్లిదండ్రులు తమ బిడ్డలను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. వారు చిన్నప్పుడు గుండెలపై తంతే మురిసిపోతారు. బుడిబుడి అడుగులు వేస్తుంటే చేయి పట్టి నడిపిస్తారు. వారు పెద్దయ్యాక తమ బాధలు దూరమవుతాయని కలలు కంటారు. అలాగే పెంచి పెద్ద చేసిన కొడుకు అమానుషంగా తల్లిని హింసించిన ఘటన రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేంఝర్ జిల్లా నారద్పూర్లోని శరషపాషి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామంలో సుభద్ర మహంతి (70) భర్త భూతుర తురామ్ మహంతి పదేళ్ల కిందట మృతి చెందాడు. దీంతో ఇద్దరు కొడుకులు, కోడళ్లతో కలిసి ఉంటోంది. సుభద్ర పెద్ద కొడుకు కరుణ మహంతి కూడా కొన్నాళ్ల క్రితం మృతి చెందాడు. చిన్న కొడుకు శతృజ్ఞ మహంతి వేరే కాపురం పెట్టాడు. దీంతో సుభద్ర పెద్ద కోడలితో కలిసి వేరే ఇంటిలో ఉంటోంది. చిన్న కుమారుడు తన ఇంటి పేరట్లో క్యాబేజీ సాగు చేశాడు. బుధవారం ఎవరో కొన్ని క్యాబేజీలను దొంగిలించారు. తల్లే దొంగతనం చేసిందని అనుమానించాడు. ఈ విషయమై తల్లిని అడగడంతోపాటు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాలు ఆమెను కొట్టాడు. శనివారం ఆమెను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి విద్యుత్తు స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను స్థానికుల సహాయంతో బాసుదేవ్పూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె చిన్న కోడలు ఆసుపత్రికి వెళ్లి సుభద్రపై దాడి చేసింది. నర్సులు, వైద్యులు ఆమెను అడ్డుకొని వృద్ధురాలిని రక్షించారు. వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
నిందితుడి అరెస్టు
తల్లిని విద్యుత్తు స్తంభానికి కట్టి కొట్టిన శతృజ్ఞ మహంతిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా బెయిలు లభించకపోవడంతో కారాగారానికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల