‘పది’లో బాలికలదేే హవా
ఈ ఏడాది రాష్ట్ర మాధ్యమిక విద్యాబోర్దు నిర్వహించిన పది పరీక్షా ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. 96.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
మొదటిస్థానంలో ఖుర్దా
భువనేశ్వర్, న్యూస్టుడే: ఈ ఏడాది రాష్ట్ర మాధ్యమిక విద్యాబోర్దు నిర్వహించిన పది పరీక్షా ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. 96.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా అమ్మాయిలదే పైచేయి. గతంలో కటక్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు విలేకరుల సమావేశం నిర్వహించి ఫలితాల పుస్తకాలు విడుదల చేసేవారు. ఈసారి దీనికి భిన్నంగా ఫలితాలు ప్రెస్ రిలీజ్ చేశారు. తర్వాత వెబ్సైట్, ఎస్ఎంఎస్ మాధ్యమాల్లో ప్రకటించారు.
- ఈ ఏడాది 5,41,061 మంది పరీక్షలు రాశారు. 5,30,153 మంది ఉత్తీర్ణులయ్యారు.
- బాలికల ఉత్తీర్ణత 96.73 శాతం కాగా, బాలురది 95.39గా నమోదైంది.
- ఫలితాల్లో 97.98 శాతం ఫలితాలలో ఖుర్దా జిల్లా అగ్రగామిగా నిలవగా, 93.91 శాతం ఫలితాలతో నువాపడ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
- 2644 ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి.
- విద్యాబోర్డు అధ్యక్షుడు శ్రీకాంత తరై విలేకరులతో మాట్లాడుతూ... ఫలితాలపై ఏమైనా అనుమానాలుంటే ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు రీ చెకింగ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సప్లమెంటరీ పరీక్షలు రాయాలనుకునే బాలబాలికలు జూన్ 10 నుంచి దరఖాస్తులు చేయాలన్నారు. పది ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, మూల్యాంకనలో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల