ఖుర్దా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భాజపా ధర్నా
ఖుర్దా అసెంబ్లీ నియోజకవర్గ భాజపా అభ్యర్థి ప్రశాంతజగ్దేవ్ను ఉద్దేశపూర్వకంగా బిజద పెద్దలు ఇరికించి అరెస్టు చేయించి కారాగారానికి తరలించారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా కార్యకర్తలు సోమవారం ఖుర్దా సబ్ కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఖుర్దా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
భువనేశ్వర్, న్యూస్టుడే: ఖుర్దా అసెంబ్లీ నియోజకవర్గ భాజపా అభ్యర్థి ప్రశాంతజగ్దేవ్ను ఉద్దేశపూర్వకంగా బిజద పెద్దలు ఇరికించి అరెస్టు చేయించి కారాగారానికి తరలించారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా కార్యకర్తలు సోమవారం ఖుర్దా సబ్ కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 25న జరిగిన మూడో విడత పోలింగ్లో బెలగడ కేంద్రానికి తన హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన జగ్దేవ్ ఈవీఎంను తోసేశారన్న ఆరోపణ వాస్తవం కాదని వారు నినాదాలు చేశారు. సీసీటీవీ పుటేజీ పరిశీలించకుండా ఏకపక్షంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం కక్షపూరిత చర్యగా పేర్కొన్నారు. దీనిపై ఖుర్దా ఎస్పీ అవినాష్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ డ్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని, పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత సీసీటీవీ పుటేజ్ పరిశీలిస్తామన్నారు. మరోవైపు భాజపా నేత, బ్రహ్మపుర లోక్సభ అభ్యర్థి ప్రదీప్కుమార్ పాణిగ్రహి సోమవారం భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ ఓటమి భయంతో బిజద నేతలు హింసను ప్రేరేపిస్తున్నారని, తమకు విధేయులుగా ఉన్న పోలీసు అధికారులతో భాజపా నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. హింజలిలో నవీన్ ఓటమి ఖాయమని, జగ్దేవ్ను ఉద్దేశపూర్వకంగా జైలుకు తరలించారని, బిజద దిగజారుడు రాజకీయాలు చూస్తున్న ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట