అన్నదాతలను మోసగించిన సీఎం: ప్రదీప్
అన్నదాతల ప్రయోజనాలు ధ్యేయమని పునరుద్ఘాటిస్తున్న నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలనలో ఏం మిగిల్చారని, వారి ఆదాయ మార్గాలు మెరగవలేదని భాజపా కృషక్ మోర్చా అధ్యక్షుడు ప్రదీప్ పురోహిత్ విమర్శలు గుప్పించారు.
ప్రదీప్ పురోహిత్
భువనేశ్వర్, న్యూస్టుడే: అన్నదాతల ప్రయోజనాలు ధ్యేయమని పునరుద్ఘాటిస్తున్న నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలనలో ఏం మిగిల్చారని, వారి ఆదాయ మార్గాలు మెరగవలేదని భాజపా కృషక్ మోర్చా అధ్యక్షుడు ప్రదీప్ పురోహిత్ విమర్శలు గుప్పించారు. సోమవారం భువనేశ్వర్లోని భాజపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో ప్రారంభించిన కాలియా కార్యక్రమం కింద రైతులకు రూ.10 వేలు చొప్పున ఏటా చెల్లిస్తామన్న సీఎం రూ.6 వేలు ఎందుకు కత్తిరించారని ప్రశ్నించారు. క్వింటాలు ధాన్యానికి రూ.వెయ్యి బోనస్ ఇస్తామన్న ఆయన మాట నిలబెట్టుకున్నారా?, మండీల్లో జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. 35 శాతం పంట పొలాలకు నీటిపారుదల అందని పరిస్థితి నెలకొందని, ఎన్నికల ముంగిట్లో నవీన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీంఎం గుమస్తా ఎన్నికల్లో విద్వేషాన్ని ఎగదోస్తున్నారని, పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో నెలకొంటున్న ఉద్రిక్తతకు బిజద గూండాలు కారణమన్నారు. భాజపా అధికారానికి వస్తుందని, అన్నదాతలకు పెద్దపీట వేస్తుందని, క్వింటాలు ధాన్యానికి మద్దతు ధర రూ.3100లు చెల్లింపు జరుగుతుందని, శీతల గిడ్డంగులు ప్రారంభిస్తామని, రైతులకు మోదీ గ్యారంటీ అమలవుతుందని ప్రదీప్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి