నిందితుడి దాడిలో కానిస్టేబుల్కు తీవ్రగాయాలు
కొరాపుట్ జిల్లా నందపూర్ ఠాణాలో బాలిక కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు.
గాయపడిన కానిస్టేబుల్ను కొరాపుట్కు తరలిస్తున్న సిబ్బంది
సిమిలిగుడ, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లా నందపూర్ ఠాణాలో బాలిక కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. ఒక నిందితుడి దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. నందపూర్ ఎస్డీపీవో సంబిత్కుమార్ మజ్జి అందించిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలిక ఇటీవల కిడ్నాప్కు గురైంది. నందపూర్కు చెందిన రమేష్ గుంట అపహరించినట్లు బాధిత కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి బాలికను, రమేష్తోపాటు ఆయనకు సహాయం చేసిన పాత్రపండికు చెందిన సయిన్ఖాన్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తుండగా రమేష్ గోడ దూకి పరారయ్యాడు. ఆయన కోసం గాలిస్తుండగా ఠాణాలో ఉన్న మరో నిందితుడు సయిన్ఖ్ాన్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ భుసిత్ టకిరిపై సమీపంలో ఉన్న తుపాకీతో దాడి చేసి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ను ప్రథమ చికిత్స అనంతరం కొరాపుట్లోని లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకు తరలించారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ భుసిత్ ఒక్కడే విధులు నిర్వహిస్తున్నారు. పరారైన సయిన్ఖాన్ కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. సోమవారం ఉదయం బిలాపుట్లో ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం