చివరి విడత ప్రచారం ముమ్మరం
మూడు విడతల పోలింగ్ ముగిసింది. చివరిదైన నాలుగో విడతకు తెర లేచింది. జూన్ 1న కేంద్రపడ, జాజ్పూర్, జగత్సింగ్పూర్, భద్రక్, బాలేశ్వర్, మయూర్భంజ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
రాష్ట్రానికి అగ్రనేతల రాక
భువనేశ్వర్, న్యూస్టుడే: మూడు విడతల పోలింగ్ ముగిసింది. చివరిదైన నాలుగో విడతకు తెర లేచింది. జూన్ 1న కేంద్రపడ, జాజ్పూర్, జగత్సింగ్పూర్, భద్రక్, బాలేశ్వర్, మయూర్భంజ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. గురువారంతో ఆయాచోట్ల ప్రచారం ముగియనుండగా, అదృష్టం పరీక్షించుకుంటున్న అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ప్రతిష్ఠ కోసం పాకులాట
ఆరోసారి అధికారం చేజిక్కించుకోవాలన్న ధ్యేయంతో ఉన్న బిజద నాయకత్వం మిషన్శక్తి మహిళల్ని రంగంలోకి దించింది. ఆ పార్టీ శ్రేణులు ఆయాచోట్ల మకాం వేసి ప్రచారం ముమ్మరం చేశాయి. డబుల్ ఇంజిన్ పాలన పల్లవి ఆలపిస్తున్న భాజపా నాయకత్వం ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వంలోని నేతలంతా ప్రచారానికి వరుసకడుతున్నారు. మరోవైపు వైభవం కోల్పోయిన కాంగ్రెస్ ప్రతిష్ఠ కోసం పరుగులు తీస్తోంది. పరువు దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది.
నాలుగోసారి ప్రధాని రాక
ప్రధాని నరేంద్రమోదీ ఇది వరకు రాష్ట్రంలో మూడు విడతల ప్రచారం చేశారు. 29న మళ్లీ వస్తున్నారు. నాలుగో విడతలో ఆయన బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బరిపద చేరుకొని భాజపా విజయ సంకల్ప ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తరువాత బాలేశ్వర్లోని రెమునా, కేంద్రపడల్లో పాల్గొంటారు. మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చాంద్బలి, కొరై, ఏళికియిలి, విమపడల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.
ఖర్గే, రాహుల్ పర్యటన
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే 29న రాష్ట్రానికి వస్తున్నారు. బాలేశ్వర్, భద్రక్లలో కాంగ్రెస్ జన ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ప్రచారానికి వస్తున్నారు. ఆయన సిములియా, సన్నొమొహతిపూర్లో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు.
ఉత్తరకోస్తాలో బిజదకు గట్టి పట్టు
ఉత్తర కోస్తా జిల్లాల్లో బిజదకు గట్టి పట్టుంది. ఆయాచోట్ల శ్రేణులు బలంగా ఉన్నాయి. గతసారి బాలేశ్వర్, మయూర్భంజ్ సీట్లు భాజపా నిలబెట్టుకోగా బిజద జాజ్పూర్, జగత్సింగ్పూర్, కేంద్రపడ, భద్రక్ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.
చివరి విడత నిర్ణయాత్మకం
నాలుగో విడత పోలింగ్ నిర్ణయాత్మకం కానుంది. ఇంతవరకు జరిగిన మూడు దశల్లో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని బిజద, భాజపాలు చెప్పుకుంటున్నాయి. నాలుగో విడతలో ఆధిక్యత సాధించే పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న అగ్రనేతలు చివరి విడత ప్రచారంపై దృష్టి సారించాయి. ఆయాచోట్ల అభ్యర్థులూ పాదయాత్రలు, రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విన్నవిస్తున్నారు. దీంతో ఉత్తరకోస్తాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం