అవినీతికి కొమ్ము కాసిన సీఎం: ధర్మేంద్ర
అవినీతి మూలాలు పెకిలిస్తామని తొలినాళ్లలో చెప్పుకున్న నవీన్ అవినీతిపరులకు కొమ్ము కాసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దుయ్యబట్టారు.
ఎంపీ అభ్యర్థి నబచరణ్ మాఝిని పరిచయం చేస్తున్న ధర్మేంద్ర
భువనేశ్వర్, న్యూస్టుడే: అవినీతి మూలాలు పెకిలిస్తామని తొలినాళ్లలో చెప్పుకున్న నవీన్ అవినీతిపరులకు కొమ్ము కాసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దుయ్యబట్టారు. సోమవారం మయూర్భంజ్ జిల్లా కేంద్రం బరిపదలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. నవీన్ పాలనలో బిజద నేతలు, కొందరు అధికారులు కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. ఇసుక, ఖనిజాలు, బొగ్గు దోపిడీ అవుతున్నా రాష్ట్రంలో పట్టించుకునేవారే కరవయ్యారన్నారు. తమిళనాడు గుమస్తాకు పాలనా బాధ్యతలు అప్పగించేసిన నవీన్కు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియవన్నారు. 25 ఏళ్లలో మాతృభాష నేర్చుకోలేకపోయిన సీఎం సహాయకులు రాసిచ్చిన నాలుగు వాఖ్యాలు చెప్పే దుస్థితి దాపురించిందన్నారు. విజ్ఞతగల ఓటర్లు ఈసారి మార్పునకు శ్రీకారం చుట్టాలని, మోదీ గ్యారంటీ పట్ల నమ్మకం పెంచుకుని భాజపాకు అవకాశమివ్వాలన్నారు. ఈ జిల్లా గిరిపుత్రిక ద్రౌపదీ ముర్ముకు రాష్ట్రపతి పదవి వరించిందని, ఈ ప్రాంతానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
[ 27-07-2024]
జయపురం - నవరంగ్పూర్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్యే గౌరీ శంకర్ ముఖం శనివారం రవాణాశాఖ మంత్రి విభుంచి భంషత్ చెన్నాను కలిశారు. -
ఐదేళ్లలో 628 మంది దుర్మరణం
[ 27-07-2024]
ఒడిశాలో గజరాజుల దాడిలో గత ఐదేళ్లలో 628 మంది దుర్మరణం చెందారు. -
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత