విశ్వాసఘాతకుల్ని ఓడించండి.. నవీన్
జనం కోసం కాకుండా స్వీయ ప్రయోజనాలే ధ్యేయంగా చేసుకుని, ఆస్తులు పెంచుకున్న విశ్వాస ఘాతకుల్ని ఓడించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
వేదికపై ఆసీనులై ఉన్న సీఎం
భువనేశ్వర్, న్యూస్టుడే: జనం కోసం కాకుండా స్వీయ ప్రయోజనాలే ధ్యేయంగా చేసుకుని, ఆస్తులు పెంచుకున్న విశ్వాస ఘాతకుల్ని ఓడించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం కేంద్రపడ, రాజ్నగర్, మహాకాళపడ, ఒళి ప్రాంతాల్లో బిజద అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన ఆయన కేంద్రపడ భాజపా ఎంపీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త బైజయంత్ పండాను నిశితంగా విమర్శించారు. ఆయనపై నమ్మకం పెంచుకుని పార్లమెంటుకు పంపిస్తే తన కంపెనీ రుణాలు మాఫీ చేయించుకుని, సంపద పెంచుకున్నారని, కేంద్రపడను విస్మరించారన్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర భాజపా నాయకులు రాష్ట్రానికి వస్తారని, తరువాత ముఖాలు చూపించరని, ప్రజాసేవ, రాష్ట్రాభివృద్ధికి అంకితమైన బిజదను ఆశీర్వదించాలని, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు కోరారు. వి.కార్తికేయ పాండ్యన్ మాట్లాడుతూ.. గతేడాది ఈ సమయంలో నవీన్ టోక్యోలో ఉన్నారని, నిప్పన్ స్టీల్ కర్మాగారం యాజమాన్యంతో చర్చించారన్నారు. కేంద్రపడలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో ఉక్కు పరిశ్రమ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, ఈ ప్రాంత యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ప్రజల కోసం పనులు చేసేవారినే గెలిపించాలని, చిత్తశుద్ధి, సత్సంకల్పం గల నవీన్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో బిజద ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.65 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్
[ 26-07-2024]
భాజపా ప్రభుత్వం తొలిసారిగా గురువారం రాత్రి శాసనసభలో 2024 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి రూ.2.65 లక్షల కోట్లతో బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టారు. -
ఆర్థికాభివృద్ధి రేటు 8.5
[ 26-07-2024]
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, 2023-24 ఆర్థికాభివృద్ధి రేటు 8.5 శాతంగా ఉందని ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. గతేడాది (2022-23) ఆర్థికాభివృద్ధి రేటు 7.9 శాతంగా నమోదైందని వివరించింది. -
అమ్మా... అని పిలిచేవారే లేకుండా పోయారు
[ 26-07-2024]
అమ్మా...! చూడు చెల్లి కొడుతోంది..చూడమ్మా అక్క రిమోట్ ఇవ్వడం లేదు..తమ్ముడు హోంవర్కు చేయడం లేదమ్మా... ఇలాంటి ఫిర్యాదులు అన్ని ఇళ్లలో వినిపిస్తుంటాయి. -
పోలవరంతో రాష్ట్రానికి నష్టం
[ 26-07-2024]
శాసనసభ శూన్య గంట (జీరో అవర్)లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సభాపక్షం (సీఎల్పీ) నేత రామచంద్ర కడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వల్ల దక్షిణ ఒడిశా జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, గ్రామాలు మునిగిపోతాయన్నారు. -
విజిలెన్స్ వలలో చిక్కిన ప్రధాన ఇంజినీరు
[ 26-07-2024]
బొలంగీర్ జిల్లా కేంద్రం పరిధిలోని లోయర్ సుక్తేల్ నీటి పారుదల ప్రాజెక్టు ప్రధాన ఇంజినీరు సునీల్రౌత్ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆదాయానికి మించి పదిరెట్లు ఆస్తులు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బొలంగీర్ జిల్లా కేంద్రం పరిధిలోని లోయర్ సుక్తేల్ నీటి పారుదల ప్రాజెక్టు ప్రధాన ఇంజినీరు సునీల్రౌత్ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆదాయానికి మించి పదిరెట్లు ఆస్తులు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. -
రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
[ 26-07-2024]
మోహన పోలీసులు రూ.30 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహన ఠాణా పరిధిలో గురువారం సాయంత్రం ఎస్.ఐ. సౌమ్యరంజన్ బోరాల్ తన బృందంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సికులిపొదర్ ప్రాంతంలో కారు, ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించగా గంజాయి లభ్యమైంది. -
కేంద్రపడలో నక్కల బెడద
[ 26-07-2024]
కేంద్రపడ జిల్లా మర్సఘాయ్ సమితిలోని పలు గ్రామాల్లో గత కొద్ది రోజులుగా నక్కల బెడద ఎక్కువవుతోంది. ఇప్పటికే వీటి దాడిలో 25 మందికిపైగా గాయపడగా, బుధవారం ఓ మహిళ మృతి చెందింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్