logo

విశ్వాసఘాతకుల్ని ఓడించండి.. నవీన్‌

జనం కోసం కాకుండా స్వీయ ప్రయోజనాలే ధ్యేయంగా చేసుకుని, ఆస్తులు పెంచుకున్న విశ్వాస ఘాతకుల్ని ఓడించాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.

Published : 28 May 2024 06:22 IST

వేదికపై ఆసీనులై ఉన్న సీఎం 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: జనం కోసం కాకుండా స్వీయ ప్రయోజనాలే ధ్యేయంగా చేసుకుని, ఆస్తులు పెంచుకున్న విశ్వాస ఘాతకుల్ని ఓడించాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. సోమవారం కేంద్రపడ, రాజ్‌నగర్, మహాకాళపడ, ఒళి ప్రాంతాల్లో బిజద అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన ఆయన కేంద్రపడ భాజపా ఎంపీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త బైజయంత్‌ పండాను నిశితంగా విమర్శించారు. ఆయనపై నమ్మకం పెంచుకుని పార్లమెంటుకు పంపిస్తే తన కంపెనీ రుణాలు మాఫీ చేయించుకుని, సంపద పెంచుకున్నారని, కేంద్రపడను విస్మరించారన్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర భాజపా నాయకులు రాష్ట్రానికి వస్తారని, తరువాత ముఖాలు చూపించరని, ప్రజాసేవ, రాష్ట్రాభివృద్ధికి అంకితమైన బిజదను ఆశీర్వదించాలని, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు కోరారు. వి.కార్తికేయ పాండ్యన్‌ మాట్లాడుతూ.. గతేడాది ఈ సమయంలో నవీన్‌ టోక్యోలో ఉన్నారని, నిప్పన్‌ స్టీల్‌ కర్మాగారం యాజమాన్యంతో చర్చించారన్నారు. కేంద్రపడలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో ఉక్కు పరిశ్రమ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, ఈ ప్రాంత యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ప్రజల కోసం పనులు చేసేవారినే గెలిపించాలని, చిత్తశుద్ధి, సత్సంకల్పం గల నవీన్‌ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో బిజద ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని