Odisha: కిడ్నాప్ కేసు దర్యాప్తులో ఇద్దరు నిందితులు పరారి
కొరాపుట్ జిల్లా నందపూర్ ఠాణాలో మైనర్ బాలిక కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు.
సిమిలిగుడ: కొరాపుట్ జిల్లా నందపూర్ ఠాణాలో మైనర్ బాలిక కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. ఒక నిందితుడి దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. నందపూర్ ఎస్డీపీవో సంబిత్ కుమార్ మజ్జి తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలో కిలువా గ్రామానికి చెందిన (మైనర్ బాలిక) ఇటీవల కిడ్నాప్కు గురైంది. నందపూర్కు చెందిన రమేశ్ గుంట కిడ్నాప్ చేసినట్లు బాధిత కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు జరిపి మైనర్ బాలికతో పాటు నిందితుడిని ఆదివారం సాయంత్రం పాత్ర పండి గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం దర్యాప్తు చేస్తుండగా రమేశ్ గోడ దూకి తప్పించుకుని పరారయ్యాడు. పోలీసులు రమేశ్ను వెతుకుతుండగా ఠాణాలో ఉన్న మరో నిందితుడు సయిన్ ఖాన్ అక్కడ విధుల్లో ఉండే కానిస్టేబుల్ భుసిత్ టకిరిపై తుపాకీతో దాడి జరిపి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న కానిస్టేబుల్ భుసిత్ను నందపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరారైన నిందితులకోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
[ 27-07-2024]
జయపురం - నవరంగ్పూర్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్యే గౌరీ శంకర్ ముఖం శనివారం రవాణాశాఖ మంత్రి విభుంచి భంషత్ చెన్నాను కలిశారు. -
ఐదేళ్లలో 628 మంది దుర్మరణం
[ 27-07-2024]
ఒడిశాలో గజరాజుల దాడిలో గత ఐదేళ్లలో 628 మంది దుర్మరణం చెందారు. -
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..