రాష్ట్రానికి పీఎంఏవై-యూ అవార్డు
రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అవార్డు లభించింది. ప్రత్యేక కేటగిరి కింద రాష్ట్రం ఉత్తమ విధానంలో చర్యలు తీసుకున్నందుకు ఈ అవార్డు దక్కింది. గుజరాత్లోని రాజ్కోట్లో బుధవారం జరిగిన ఇండియన్ హౌసింగ్ కాన్క్లేవ్లో కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అవార్డును ప్రదానం చేశారు.
రాష్ట్రం తరఫున అవార్డు అందుకుంటున్న సంగ్రామ్జిత్, దేబాశిస్
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అవార్డు లభించింది. ప్రత్యేక కేటగిరి కింద రాష్ట్రం ఉత్తమ విధానంలో చర్యలు తీసుకున్నందుకు ఈ అవార్డు దక్కింది. గుజరాత్లోని రాజ్కోట్లో బుధవారం జరిగిన ఇండియన్ హౌసింగ్ కాన్క్లేవ్లో కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అవార్డును ప్రదానం చేశారు. పట్టణ అడ్మినిస్ట్రేషన్, జాగా మిషన్ సంచాలకుడు సంగ్రామ్జిత్ నాయక్, ఒడిశా పట్టణ గృహనిర్మాణ మిషన్ సంచాలకుడు దేబాశిష్ సింగ్ హాజరై రాష్ట్రం తరఫున దీనిని స్వీకరించారు.
జాగా మిషన్ భేష్...
రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని పట్టణ పేదల కోసం ఒడిశా సర్కార్ తీసుకుంటున్న చర్యలు మార్గదర్శకంగా ఉన్నాయని కేంద్రం కొనియాడింది. జాగా మిషన్ పేరుతో అమలు చేస్తున్న పథకానికి సంబంధించి లబ్ధిదారులకు పీఎంఏవై-యూ కింద గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం దక్కిన విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది. ఒడిశా మురికివాడల నివాసుల భూమి హక్కుచట్టం-2017 ద్వారా పట్టణ పేదల్లో నెలకొన్న అసమానతలు తగ్గించేందుకు రాష్ట్రం మంచి మార్గాన్ని ఎంచుకుందని ఈ సందర్భంగా కేంద్రం కొనియాడింది.
మౌలిక వసతుల కల్పన..
జాగా మిషన్ అమలుతో రాష్ట్రంలో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణంతోపాటు అన్నిరకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. జాగా మిషన్ ద్వారా పేదలకు నివాస భరోసా, ఇళ్లకు విద్యుత్తు, కొళాయిల ద్వారా నీటి సరఫరా, వ్యక్తిగత మరుగుదొడ్లు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, రహదారి తదితరులు సదుపాయాలు సమకూరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా దీని ద్వారా లబ్ధిదారులకు భూమి హక్కు దక్కుతుండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్