భిన్న సంస్కృతుల కలయిక చొయితి వేదిక
అత్యధిక శాతం ఆదివాసీలు నివసిస్తున్న రాయగడ జిల్లా భిన్న సంస్కృతుల కలయిక అని, ఆదివాసీల కళలు, సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడవలసి ఉందని మంత్రి జగన్నాథ సరక అన్నారు.
భువనేశ్వర్ కళాకారుల ఒడిస్సీ నృత్యం
రాయగడ, న్యూస్టుడే: అత్యధిక శాతం ఆదివాసీలు నివసిస్తున్న రాయగడ జిల్లా భిన్న సంస్కృతుల కలయిక అని, ఆదివాసీల కళలు, సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడవలసి ఉందని మంత్రి జగన్నాథ సరక అన్నారు. బుధవారం రాత్రి జీసీడీ క్రీడామైదానంలో ప్రారంభమైన జిల్లా సాంస్కృతిక ఉత్సవం చొయితి తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పాలనాధికారి స్వాధాదేవ్ సింగ్ మాట్లాడుతూ జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారీ పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయన్నారు. రైతులు, ఆదివాసీల ఉన్నతికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మిల్లెట్ మిషన్ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. చొయితి వేదిక కళాకారులను ప్రోత్సహించేందుకే అని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ సప్తగిరి ఉలక, బిజు ఆరోగ్య పథకం రాష్ట్ర సలహాదారు సుధీర్దాస్, ఎస్పీ వివేకానంద శర్మ, జిల్లా పరిషత్, పురపాలక సంస్థ, సమితుల అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు చొయితి వార్షిక సంచిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక కవులు, అతిథులను సత్కరించారు.
చొయితి సంచికను ఆవిష్కరిస్తున్న సరక, సప్తగిరి, స్వాధాదేవ్ తదితరులు
అబ్బుర పరిచిన సాంస్కృతిక కార్యక్రమాలు
దేశవిదేశాల్లో కీర్తి గడించిన ఒడిస్సీ నృత్యంతో మొదట భువనేశ్వర్ కళాకారులు అలరించారు. అనంతరం లంజియా సవర, డొంగిరియా, కొంద కళాకారుల ఆదివాసీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు అర్ధరాత్రి ప్రేక్షకులు తిలకించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్