భిన్న సంస్కృతుల కలయిక చొయితి వేదిక
అత్యధిక శాతం ఆదివాసీలు నివసిస్తున్న రాయగడ జిల్లా భిన్న సంస్కృతుల కలయిక అని, ఆదివాసీల కళలు, సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడవలసి ఉందని మంత్రి జగన్నాథ సరక అన్నారు.
భువనేశ్వర్ కళాకారుల ఒడిస్సీ నృత్యం
రాయగడ, న్యూస్టుడే: అత్యధిక శాతం ఆదివాసీలు నివసిస్తున్న రాయగడ జిల్లా భిన్న సంస్కృతుల కలయిక అని, ఆదివాసీల కళలు, సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడవలసి ఉందని మంత్రి జగన్నాథ సరక అన్నారు. బుధవారం రాత్రి జీసీడీ క్రీడామైదానంలో ప్రారంభమైన జిల్లా సాంస్కృతిక ఉత్సవం చొయితి తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పాలనాధికారి స్వాధాదేవ్ సింగ్ మాట్లాడుతూ జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారీ పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయన్నారు. రైతులు, ఆదివాసీల ఉన్నతికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మిల్లెట్ మిషన్ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. చొయితి వేదిక కళాకారులను ప్రోత్సహించేందుకే అని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ సప్తగిరి ఉలక, బిజు ఆరోగ్య పథకం రాష్ట్ర సలహాదారు సుధీర్దాస్, ఎస్పీ వివేకానంద శర్మ, జిల్లా పరిషత్, పురపాలక సంస్థ, సమితుల అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు చొయితి వార్షిక సంచిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక కవులు, అతిథులను సత్కరించారు.
చొయితి సంచికను ఆవిష్కరిస్తున్న సరక, సప్తగిరి, స్వాధాదేవ్ తదితరులు
అబ్బుర పరిచిన సాంస్కృతిక కార్యక్రమాలు
దేశవిదేశాల్లో కీర్తి గడించిన ఒడిస్సీ నృత్యంతో మొదట భువనేశ్వర్ కళాకారులు అలరించారు. అనంతరం లంజియా సవర, డొంగిరియా, కొంద కళాకారుల ఆదివాసీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు అర్ధరాత్రి ప్రేక్షకులు తిలకించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్