logo

మావో డంప్ స్వాధీనం

మల్కాన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో డీవీఎఫ్ జవాన్‌లు మావో డంప్ స్వాధీనం చేసుకున్నారు.

Updated : 03 Apr 2024 15:17 IST

మల్కాన్‌గిరి: మల్కాన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో డీవీఎఫ్ జవాన్‌లు మావో డంప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై మల్కాన్‌గిరి ఎస్పీ నితీశ్‌ వధ్వాని తెలిపిన వివరాల ప్రకారం.. కలిమెల సమితిలో మావో డంప్ ఉందన్న సమాచారం మేరకు బుధవారం ఉదయం డీవీఎఫ్‌ జవాన్‌లు కలిమెల సమితి దయాలుండ్ గ్రామం దగ్గర వున్న అడవిలో కూంబింగ్‌ నిర్వహించారు. అదే సమయంలో ఓ చోట మట్టికింద పాతి పెట్టి ఉన్న మావో డంప్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆ డంప్ నుంచి మొత్తం 190 జిలటిన్ స్టిక్లు, 12 టిఫిన్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు కలిమెల ప్రాంతం మావోయిస్టులు అడ్డాగా వున్న సమయంలో ఈ సామగ్రిలను వుంచినట్లు, ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిష్టులు లేకపోయినప్పటికి ఈ డంప్ చాలా కాలంగా ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని