గ్రామీణ రహదారులకు మోక్షం
రాష్ట్రంలో రహదారుల నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యంత్రాంగంలో కదలిక వచ్చింది. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు మరమ్మతులు చేసే దిశగా జిల్లాలో కసరత్తు జరుగుతోంది.
మరమ్మతులకు 20 మార్గాల గుర్తింపు
కొమరాడ మండలం అర్తాం నుంచి కళ్లికోటకు వెళ్లే రహదారి ఇది. గోతులమయంగా మారిన దీన్ని మరమ్మతులకు అధికారులు ప్రతిపాదించారు.
పార్వతీపురం, న్యూస్టుడే: రాష్ట్రంలో రహదారుల నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యంత్రాంగంలో కదలిక వచ్చింది. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు మరమ్మతులు చేసే దిశగా జిల్లాలో కసరత్తు జరుగుతోంది. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అవసరమైన నిధులపై అంచనాలు రూపొందించాలని పీఆర్, ర.భ., ప్రజా పనులు, గిరిజన సంక్షేమ శాఖల అధికారులను కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. ఈ అంచనాలను బుధవారం నాటికి సమర్పిస్తే సీఎంవోకు పంపించనున్నారు.
జిల్లాలో నియోజకవర్గానికి ఐదు రహదారుల చొప్పున 20 ప్రతిపాదించారు. వీటిని అత్యంత ప్రాధాన్యమున్న జాబితాలో చేర్చారు. ఇప్పటికే వీటిలో కొన్ని పనులు జరుగుతుండగా మిగిలినవి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నట్లు చూపారు.
నియోజకవర్గాల వారీగా..
కురుపాం..
కొమరాడ మండలంలోని అర్తాం -కళ్లికోట (4.5 కి.మీ), గరుగుబిల్లి మండలంలోని వల్లరిగుడబ- రాయందొరవలస (2.5 కి.మీ), జియ్యమ్మవలస మండలంలోని బీజేపురం-తురకనాయుడువలస (7.7 కి.మీ), చినమేరంగి - పిప్పలభద్ర (4.4 కి.మీ), పూర్తిగా కోతకు గురైన కురుపాం మండలంలోని నీలకంఠాపురం-జరడ (9 కి.మీ) మార్గం.
పార్వతీపురం..
పార్వతీపురం మండలం ఎన్.ములగ - డోకిశిల (5 కి.మీ) బలిజిపేట మండలం బర్లి - అరసాడ, అరసాడ-మురగడం, సీతానగరం మండలం బూర్జ -గాజులవలస, ఏగోటివలస మీదుగా గాదెలవలస వరకు.
సాలూరు..
పాచిపెంట మండలం పద్మాపురం-ఏతంవలస, మెంటాడ మండలం లక్ష్మీపురం, పిట్టాడ, జయతి రోడ్లు.సాలూరు నుంచి మక్కువ వరకు ఉన్న రోడ్డును ప్రస్తుతం జాతీయ అభివృద్ధి బ్యాంకు నిధులతో మెరుగుపరుస్తున్నారు. ఇక్కడ సాలూరు పట్టణంలో పోస్టాఫీసు, శివాజీ బొమ్మ వద్ద రోడ్లను ప్రాధాన్యత జాబితాలో చేర్చారు.
పాలకొండ..
సీతంపేట మండలం ముత్యాలు కూడలి నుంచి చాకలిగూడ వరకు (7 కి.మీ), తొత్తడి - బోయనగూడ, జంపరకోట - అచ్చబ, వీరఘట్టం మండలం సీపీఎస్ - చిమిడి (5 కి.మీ), నవగాం కూడలి -జంపరకోట మార్గాలకు మరమ్మతులు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు