Horrible Tragedy: నాలుక కోసి.. తల్లిని హతమార్చి..
కన్న కుమారుడే ఆమె పాలిటి యముడయ్యాడు. మద్యం మానేసి, జీవితాన్ని చక్కబెట్టుకో అని చెప్పినందుకు తల్లి నాలుక కోసి.. హత్య చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది.
మద్యంమత్తులో తనయుడి ఘాతుకం
ఉప్పల రమణమ్మ(పాతచిత్రం)
రామభద్రపురం, న్యూస్టుడే: కన్న కుమారుడే ఆమె పాలిటి యముడయ్యాడు. మద్యం మానేసి, జీవితాన్ని చక్కబెట్టుకో అని చెప్పినందుకు తల్లి నాలుక కోసి.. హత్య చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐలు సురేంద్రనాయుడు, జయంతి వివరాల మేరకు.. రామభద్రపురం గ్రామానికి చెందిన ఉప్పల రమణమ్మ(75) తన కుమారుడు శ్రీనుతో కలిసి ఉంటోంది. అవివాహితుడైన ఆయన టిఫిన్ దుకాణాన్ని నడుపుతున్నాడు. కొన్నాళ్లుగా మద్యానికి బానిసై.. ఇంటి ఖర్చులకు ఉంచిన డబ్బు, తల్లి పింఛను ను దుబారా చేస్తున్నాడు. గురువారం రాత్రి శ్రీను పూటుగా తాగి ఇంటికి వెళ్లడంతో రమణమ్మ మందలించింది. దీంతో సుత్తి తీసుకుని బలంగా తలపై కొట్టి, నాలుకను కోసేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం ఉదయం ఎంతకీ వృద్ధురాలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు పరిశీలించగా.. ఇంట్లో రక్తపుమడుగులో పడి ఉండటం గుర్తించారు. మృతురాలి కుమార్తెలకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్ఛార్జి ఎస్ఐ జయంతి, ఏఎస్ఐ చిన్నయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీను పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే