Parvathipuram: ఈ గుడ్లు తింటే అంతే..
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు విధిగా గుడ్లు అందించాలి. పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంపిణీ జరగాలి.
పార్వతీపురం పట్టణం బైపాస్ కాలనీలోని అంగన్వాడీలో లబ్ధిదారులకు ఇచ్చిన గుడ్లు
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు విధిగా గుడ్లు అందించాలి. పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంపిణీ జరగాలి. ఇటీవల ఇంటికే పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే కేంద్రాల ద్వారా అందిస్తున్న సరకుల్లో నాణ్యతా లోపం బయట పడుతోంది. వారిచ్చే గుడ్లను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పార్వతీపురంలోని బైపాస్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఇద్దరు బాలింతలకు గుడ్లు ఇచ్చారు. ఇంటికి తీసుకువచ్చి చూస్తే అన్నీ కుళ్లిపోయాయి. లోపలి సొన అంతా నల్లగా మారి, దుర్వాసన వస్తోందని వారు తెలిపారు. గతంలో కూడా ఇలాంటివే ఇచ్చారని, అన్నీ పారబోసినట్లు ‘న్యూస్టుడే’కు చెప్పారు. కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లను పర్యవేక్షకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పరిశీలించాలి. నిల్వ ఉన్నా.. పాడైపోయినా వెంటనే తిప్పి పంపాలి. కానీ ఎక్కడా పరిశీలన జరగడం లేదు. ఆ పరిస్థితికి ప్రస్తుత ఘటన అద్దం పడుతోంది. ఈ విషయాన్ని జిల్లా మహిళా సంక్షేమ సాధికారత అధికారిణి విజయగౌరి వద్ద ప్రస్తావించగా.. దీనిపై దర్యాప్తు చేయిస్తామని, లబ్ధిదారులకు మంచి గుడ్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని
చెప్పారు.
న్యూస్టుడే, పార్వతీపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల