అప్పటి నుంచే ఖర్చుకు లెక్క..!
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపటి నుంచి నామపత్రాల స్వీకరణ
రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్
ఈనాడు-విజయనగరం, న్యూస్టుడే, విజయనగరం అర్బన్, ఉడాకాలనీ: ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల, అదే రోజు నుంచే నామపత్రాలను స్వీకరిస్తారు. 25వ తేదీ వరకు స్వీకరిస్తారు. 26న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి వారి ఖాతాలోనే ఖర్చును లెక్కిస్తారు. జెండా నుంచి భోజనం వరకు వారు చేసే ప్రతి ఖర్చును వారి ఖాతాలో లెక్కగడతారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశంలో జేసీ కార్తీక్, డీఆర్వో అనిత, పార్టీల ప్రతినిధులు రొంగలి పోతన్న, సోములు, రమేశ్కుమార్, నరసింహరాజు హాజరయ్యారు.
పార్లమెంటు స్థానాలకు కలెక్టరేట్లో..
ఉమ్మడి జిల్లాలోని 11 అసెంబ్లీ, విజయనగరం, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాల నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీ స్థానానికి జిల్లాల కలెక్టరేట్ల్లో దాఖలు చేయాలి. జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎస్.నాగలక్ష్మి, నిశాంత్ కుమార్ వీటిని స్వీకరిస్తారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి జేసీ కె.కార్తీక్ తహసీల్దారు కార్యాలయంలో నామపత్రాలు తీసుకుంటారు.
సహాయక కేంద్రాల ఏర్పాటు
కలెక్టరేట్లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల తరఫున వారు కేంద్రంలో సమాచారం తీసుకుని, తప్పొప్పులు సరిచేసు కోవచ్చని డీఆర్వో ఎస్.డి.అనిత తెలిపారు.
గమనించాల్సినవి..
- సెలవు రోజుల్లో మినహా ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు స్వీకరణ.
- అభ్యర్థులు 13 రకాల ధ్రువపత్రాలు సమర్పించాలి.
- అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్లు, రెండు నియోజకవర్గాల నుంచి మాత్రమే దాఖలు చేయవచ్చు.
- నామినేషన్ దాఖలు చేసిన తర్వాత హార్డ్ కాపీలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసేందుకు మూడు వాహనాలు, అయిదుగురు వ్యక్తులు (అభ్యర్థితో సహా) రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అనుమతిస్తారు.
- 100 మీటర్ల తర్వాత వాహనాలకు అనుమతిలేదు.
- ప్రతి నియోజకవర్గంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తారు.
అందుబాటులోకి ప్రత్యేక యాప్
-
నామపత్రాల కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, దాఖలు చేసే విధానంపై ఇందులో పొందుపర్చారు. అన్ని పత్రాలను యాప్ ద్వారానే అందజేయాలి. ప్రచారానికి సంబంధించి కార్యక్రమాలు, వాహనాలు, ఇతర వాటికి ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాల్యవివాహాలపై అవగాహన ర్యాలీ, సదస్సు
[ 27-07-2024]
బాల్య వివాహాలు, లింగవివక్షత చట్టవిరుద్ధమని, ఆడపిల్లలను సంరక్షించాలని పార్వతీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టరు ఎంఎన్రాణి అన్నారు. -
శిక్షా సప్తాహ్ కార్యక్రమం
[ 27-07-2024]
శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. -
ఐటీడీఏ ఎదుట గిరిజన సీఆర్టీల నిరసన
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గిరిజన సీఆర్టీలు ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఆర్పీలు దీక్షలు చేస్తున్నారు. -
తొలి విడతగా పాఠశాలలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : కూటమి ప్రభుత్వం వచ్చాక పేద విద్యార్థులకు మరింత ఊరట కలిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, అచ్చు పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో హామీ ఇచ్చారు. -
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్