ఇది జగనన్న చెత్త పన్ను
ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వంగా పేరుగాంచింది వైకాపా. అన్నిరకాల పన్నులు పెంచేసింది. వివిధ రకాల ఛార్జీల భారాన్ని మోపింది.
ప్రజలపై ప్రతి నెలా ఆర్థిక భారం
రెండు జిల్లా కేంద్రాల్లో బాదుడు
ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వంగా పేరుగాంచింది వైకాపా. అన్నిరకాల పన్నులు పెంచేసింది. వివిధ రకాల ఛార్జీల భారాన్ని మోపింది. చివరకు చెత్తకూ పన్ను వేసి, పురపాలక ప్రజల నుంచి డబ్బులు గుంజేసింది. క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డి కచ్చితంగా వసూలు చేయాలని పురపాలక శాఖ ద్వారా ప్రత్యేక ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో కొన్ని నెలల పాటు పట్టణాల వాసులు గగ్గోలు పెట్టారు. ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా ప్రక్రియను ఆపినట్లు తెలుస్తోంది.
ఈనాడు- విజయనగరం: - న్యూస్టుడే, విజయనగరం పట్టణం
వ్యతిరేకించినా..
పన్ను చెల్లించడానికి చాలామంది బలవంతంగానే ముందుకొచ్చారు. కొందరు వ్యతిరేకించారు. మరోవైపు నెలవారీ గృహ, వాణిజ్య సంస్థల నుంచి పూర్తి స్థాయిలో పన్ను వసూలు కాకపోవడంతో చెత్త వాహనాల నిర్వాహకులకు సాధారణ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. విజయనగరంలో అమలవుతుండగా, బొబ్బిలి, సాలూరు, రాజాం పురపాలికలు, పాలకొండ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో గతంలో నమూనాగా అమలు చేశారు.
నగరపాలక సంస్థలో..
క్లాప్ కార్యక్రమం అమలులో భాగంగా నగరానికి 63 వాహనాలు ఇచ్చారు. వీటి నిర్వహణకు చెత్త పన్ను సొమ్మును వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత ఏజెన్సీకి ఒక్కో వాహనానికీ అద్దె రూపంలో నెలకు రూ.65,300 చొప్పున చెల్లించాలి. ఏడాదికి 5 శాతం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలో కనిష్ఠంగా రూ.150 నుంచి గరిష్ఠంగా రూ.15 వేల వరకు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో 53 వాహనాలు తిప్పారు. ప్రస్తుతం 47 తిరుగుతున్నాయి. వీటికి ఇప్పటికే రూ.3 కోట్ల మేర ఇవ్వాలి. దీంతో సాధారణ నిధుల నుంచి చెల్లింపులు చేశారు. అభివృద్ధికి ఉపయోగించాల్సిన సొమ్మును అటువైపు మళ్లించడంతో సభ్యులు సైతం మండిపడ్డారు.
యూజర్ ఛార్జీల కింద..
‘క్లాప్ వాహనాల నిర్వహణకు యూజర్ ఛార్జీల రూపేణా వసూలు చేస్తున్నాం. ఈ మేరకు సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంది. పన్ను వసూళ్లు తగ్గడంతో ఇప్పటి వరకు సాధారణ నిధులు రూ.42 లక్షలు చెల్లించాం’ అని నగరపాలక సంస్థ కమిషనర్ మల్లయ్యనాయుడు తెలిపారు.
పింఛను నుంచి తీసుకునేవారు
ప్రతి నెలా చెత్త పన్ను చెల్లించడం భారంగా ఉంది. చెల్లించకపోతే పింఛను నుంచి తీసుకుంటున్నారు. మూడు నెలల క్రితం నా భర్త చనిపోయారు. అప్పటి నుంచి ఇవ్వనని చెప్పేశాను.
-ముగతమ్మ, విజయనగరం
నెలకు రూ.60
చెత్తపన్ను నెలకు రూ.60 తీసుకుంటున్నారు. ఇంటి పన్ను చెల్లిస్తున్నాం. అందులో కూడా చెత్త పన్ను ఉందని అన్నారు. మళ్లీ కొత్తగా తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. అయినా పారిశుద్ధ్య పనులు చేయడం లేదు. రోజుల తరబడి వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.
-కె. గౌరి, గాజులరేగ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట