రాష్ట్రాభివృద్ధికి కూటమి గెలవాలి
రాష్ట్రంలో రాజకీయం కోడికత్తి నుంచి ప్రారంభమై గులకరాయి వరకు వచ్చింది. ఇటువంటి వారిని ఇంటికి పంపించకపోతే ప్రజలు నష్టపోతారు. ఇవన్నీ చౌకబారు రాజకీయాలు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్గజపతిరాజు
గాజులరేగ సభలో మాట్లాడుతున్న అశోక్
రాష్ట్రంలో రాజకీయం కోడికత్తి నుంచి ప్రారంభమై గులకరాయి వరకు వచ్చింది. ఇటువంటి వారిని ఇంటికి పంపించకపోతే ప్రజలు నష్టపోతారు. ఇవన్నీ చౌకబారు రాజకీయాలు. అయిదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి.
- అశోక్గజపతిరాజు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: రాష్ట్రాభివృద్ధికి కూటమిని గెలిపించాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గాజులరేగ, కణపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కొత్తతరానికి అవకాశం ఇవ్వాలన్నదే పార్టీ ఆలోచనని, అందుకే అదితి, కలిశెట్టి అప్పలనాయుడుకు టిక్కెట్లు ఇచ్చారన్నారు. అందుకే తాను సుదీర్ఘ రాజకీయాల నుంచి తప్పుకొన్నట్లు పేర్కొన్నారు.
హామీలతో మభ్యపెట్టారు: అదితి
అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని కూటమి అభ్యర్థి అదితి గజపతిరాజు అన్నారు. యువతకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. అశోక్బంగ్లాలో మంగళవారం 11-20 వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అనుంబంధ కమిటీలు, బూత్ ఇన్ఛార్జులతో సమీక్ష నిర్వహించారు. పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చిన జగన్, సీఎం అయ్యాక యువతకు ఇస్తామన్న జాబ్ కేలండర్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబుతోనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించినవి చంద్రబాబు అమలు చేస్తారన్నారు. ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.యశస్వి, ఐవీపీ రాజు, ప్రసాదుల వరప్రసాద్, ఆల్తి బంగారుబాబు, కాళ్ల గౌరీశంకర్, కర్రోతు నర్సింగరావు, నడిపల్లి రవికుమార్ పాల్గొన్నారు.
350 కుటుంబాల చేరిక
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: విజయనగరంలో 350 వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరాయి. అశోక్ బంగ్లాలో మంగళవారం నియోజకవర్గ ఇన్ఛార్జి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో వారంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గాజులరేగ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ గార సత్యనారాయణ, కటారి శ్రీనివాసులు, జి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో 300 కుటుంబాలు, 26 డివిజన్కు చెందిన సదాయి భాస్కరరావు, ముప్పర్తి శ్రీనివాస్, కొప్పరపు సతీష్ ఆధ్వర్యంలో 25 కుటుంబాలు, పదో డివిజన్కు చెందిన ఆండ్ర చిన్న, కల్యాణ్ సింగ్, అదపాక తిరుపతి, రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరో 25 కుటుంబాలు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ