జగన్ కక్ష..రోగులకు శిక్ష
ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే రోగులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది వైకాపా సర్కారు. గత ప్రభుత్వంపై కక్షతో అప్పట్లో ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల పథకాలను మూలకు చేర్చింది.
నాటి పథకాలను మూలకు చేర్చిన వైకాపా
ప్రభుత్వఆసుపత్రుల్లో రోగుల విలవిల
ఘోష ఆసుపత్రి భవనంపై నిరుపయోగంగా సౌరవిద్యుత్తు ప్లాంటు
వివిధ రకాల వ్యాధులు, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే రోగులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది వైకాపా సర్కారు. గత ప్రభుత్వంపై కక్షతో అప్పట్లో ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల పథకాలను మూలకు చేర్చింది. కనీసం నిర్వహణ లేకపోవడంతో ప్రస్తుతం అవన్నీ వినియోగానికి దూరమయ్యాయి. చివరకు గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడేవాటినీ పట్టించుకోలేదు సీఎం జగన్మోహన్రెడ్డి.
- న్యూస్టుడే, విజయనగరం వైద్యవిభాగం
ఆసుపత్రులపై విద్యుత్తు భారం పడకుండా ఉండేందుకు, సౌర విద్యుత్తును పెంచేందుకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తన నియోజకవర్గం పరిధిలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా అవకాశం ఉన్న ప్రతిచోటా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రోగులు, గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడేలా ప్రభుత్వ పీహెచ్సీలు, సీహెచ్సీలు, అప్పటి కేంద్ర, ఘోష ఆసుపత్రుల్లో ప్లాంట్లు నెలకొల్పారు. దీంతో ఎంతో మందికి సౌకర్యంగా నిలిచేవి. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ వ్యవస్థ అంతా తారుమారైంది.
కేంద్రాసుపత్రిలో ఇలా..
గత ప్రభుత్వ హయంలో రూ.కోట్ల మేర వెచ్చించి కేంద్రాసుపత్రి(ప్రస్తుతం సర్వజన)పై సోలార్ ప్లాంటు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ వైద్యాలయానికి నెలకు రూ.3 లక్షలకుపైగానే బిల్లు వచ్చేది. సౌర వ్యవస్థతో ఆ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కొంత విద్యుత్తును ఏపీఈపీడీసీఎల్కు అమ్ముకోవచ్చని భావించారు. దాదాపు ఐదేళ్ల పాటు సేవలు అందాయి. వైకాపా వచ్చిన ప్రారంభంలో అరకొరగా పనిచేసిన ప్లాంటు అనంతరం మూలకు చేరింది. ఆసుపత్రికి విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు.
బండకేసి బాదాల్సిందే..
నిరుపయోగంగా లాండ్రీ
2014లో అశోక్ గజపతిరాజు కృషితో ఘోషాసుపత్రిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మోడరన్ మెక్నైజ్డ్ లాండ్రీ వ్యవస్థ ఏర్పాటైంది. శస్త్రచికిత్సల్లో పాల్గొనే వైద్యులు, సంబంధిత రోగుల దుస్తులను కూడా ఇక్కడే ఉతికేవారు. దీనికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.17.50 లక్షలు వెచ్చించారు. 2019లో ఇది మరమ్మతులకు గురైంది. బాగుచేసేందుకు డబ్బుల్లేక మూలకు చేర్చారు. సోలార్ ప్లాంటు, మెక్నైజ్డ్ లాండ్రీని పరిశీలించి, అవసరం మేరకు చర్యలు తీసుకుంటామని ఆర్ఎంవో సురేష్ చెప్పారు.
వేడి నీళ్లకు...
పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలతో పాటు ఘోషాసుపత్రిలో రూ.28.62 లక్షలతో సోలార్ వాటర్ హీటర్స్ను ఏర్పాటు చేశారు. వీటితో రోగులకు వేడినీటి సౌకర్యం కల్పించారు. ఫలితంగా రోజుకు 2800 మంది బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఉపయోగించుకునేవారు. అప్పుడే పుట్టిన పిల్లలకు వేడి నీటి స్నానం ఉపయోగకరంగా ఉండేది. విద్యుత్తు సైతం ఆదా అయ్యేది. వైకాపా వచ్చిన ప్రారంభంలోనే వీటన్నింటినీ ఆపేసింది. ప్రస్తుతం ఎక్కడా పనిచేయడం లేదు. ఘోష ఆసుపత్రిలో ప్రస్తుతం కొందరు రోగులు రూ.15 పెట్టి వేడి నీటి సీసా కొనుక్కుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్షా సప్తాహ్ కార్యక్రమం
[ 27-07-2024]
శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. -
ఐటీడీఏ ఎదుట గిరిజన సీఆర్టీల నిరసన
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గిరిజన సీఆర్టీలు ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఆర్పీలు దీక్షలు చేస్తున్నారు. -
తొలి విడతగా పాఠశాలలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : కూటమి ప్రభుత్వం వచ్చాక పేద విద్యార్థులకు మరింత ఊరట కలిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, అచ్చు పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో హామీ ఇచ్చారు. -
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్