గూడు కట్టిస్తారా..? దారే చూపలేదు..
ఇళ్లు కాదు.. ఊళ్లే నిర్మిస్తాం అన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు వేలు, లక్షల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేసి వారి సొంతింటి కల సాకారం చేస్తామన్నారు.
మూడేళ్లైనా పేదల ఇళ్లకు మోక్షం లేదు
గృహ లబ్ధిదారులకు తప్పని అవస్థలు
మొండిగోడలతో నిలిచిపోయిన నెలిపర్తి కాలనీలో పేదల ఇళ్లు
న్యూస్టుడే, సాలూరు: ఇళ్లు కాదు.. ఊళ్లే నిర్మిస్తాం అన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు వేలు, లక్షల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేసి వారి సొంతింటి కల సాకారం చేస్తామన్నారు.. వైకాపా అయిదేళ్ల పాలనలో జగనన్న కాలనీలకు కనీసం దారి కూడా చూపలేకపోయారు పాలకులు. మంజూరైన ఇళ్లు రద్దవుతాయనే భయంతో అప్పులు చేసి, నానా అవస్థలు పడి లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇళ్లు పునాదులకే పరిమితమయ్యాయి. సాలూరు పట్టణంలోని గుమడాం, నెలిపర్తి కాలనీల్లో పరిస్థితే ఇందుకు నిదర్శనం.
సాలూరులోని రెండు లేఅవుట్లలో సుమారు 2,676 మందికి ఇళ్లు మంజూరు కాగా, 114 మందే నిర్మించారు. వీటిలో 1,024 వివిధ దశల్లో ఉన్నాయి. మూడేళ్లలో కనీసం పది శాతం కూడా పనులు జరగలేదు. మౌలిక సదుపాయాలు కల్పించక పోవడమే దీనికి కారణం. కాలనీలకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు లేదు. దీంతో నిర్మాణ సామగ్రి తరలించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నెలిపర్తి-1 లేఅవుట్కు అప్రోచ్ రోడ్డుకు రూ.45 లక్షలు, నెలిపర్తి-2 లేఅవుట్, ఇతర రోడ్ల నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరై, టెండర్లు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. వీటితో పాటు ప్రత్యామ్నాయదారి, గుమడాం, పెదహరిజనపేట సమీపంలో ఉన్న లేఅవుట్లలో రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు చేశారు తప్ప నిధులు మంజూరు కాలేదు. దారే చూపని వారు ఇళ్లేం కట్టిస్తారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులను రోడ్డు పనులు చేయాలని కోరామని, పనులు జరిపిస్తామని పుర ఏఈ సూరినాయుడు తెలిపారు.
నెలిపర్తి-2 లేఅవుట్లో అధ్వానంగా దారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం