logo

లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు

రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు.

Published : 25 Apr 2024 04:05 IST

వాలంటీర్లు పిలిచారని చెబుతున్న మహిళలు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. వారు స్వేచ్ఛగా వైకాపాకు పనిచేయవచ్చు అనుకున్నారేమో.. బుధవారం రాత్రి ఆ పార్టీ నేతల సూచనలతో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. శివాలయం వద్దకు వస్తే మిగిలిన చేయూత డబ్బు వస్తుందంటూ మభ్యపెట్టి మహిళలను పిలిచారు. వాలంటీర్లు రాజీనామా చేసినట్లు వారికి తెలియకపోవడంతో వారంతా శివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెదేపా కార్యకర్తలు చెప్పగా కొందరు వెనుదిరిగారు. మరికొందరు సమావేశానికి వెళ్లారు. రాజీనామా చేసిన వాలంటీర్లు ఈ విధంగా వ్యవహరించడంపై ఎంపీడీవో కె.రూపేష్‌ని వివరణ కోరగా.. ప్రభుత్వ పథకాలపై మభ్యపెట్టడం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని, గురువారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని