తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి.
రూ.కోట్ల వ్యయం.. నిరుపయోగం
సామాజిక కేంద్రాలు అలంకారప్రాయం
న్యూస్టుడే, భోగాపురం/పూసపాటిరేగ
ముక్కాంలో శిథిలావస్థకు చేరిన ఫిష్ల్యాండింగ్ కేంద్రం
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. పదేళ్ల కిందట భోగాపురం మండలం ముక్కాంలో, పూసపాటిరేగ మండలం చింతపల్లిలో వలలు, మోటార్లు, పరికరాలతో పాటు చేపలను భద్రపరిచేందుకు భవనాలను కట్టారు. ఒక్కో కేంద్రానికి రూ.80 లక్షలు వెచ్చించారు. అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే ఇవి ప్రారంభానికి నోచుకోక వినియోగానికి దూరమయ్యాయి. అయిదేళ్ల వైకాపా పాలనలో నిర్వహణ పనులు కొరవడటంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.
అనువుగా లేని చోట...
మత్స్యకార జనాభా అధికంగా ఉన్న ముక్కాం, చింతపల్లి గ్రామాల్లో సామాజిక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న అధికారుల ఆలోచన బాగానే ఉంది. అయితే వీటిని ఒడ్డుకు దూరంగా అనువుగా లేని ప్రదేశాల్లో నిర్మించడంతో వృథాగా పడి ఉన్నాయి. ఇక్కడ మత్స్యసంపదను నిలువ చేసేందుకు వీలుగా విద్యుత్తు, మంచినీటి సౌకర్యాలు కల్పించినా.. చేపల ఆరబోతకు ప్లాట్ఫాంలు నిర్మించినా.. అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు ముందుకు రాక నిరుపయోగంగా మారాయి.
వినియోగానికి దూరంగా..
చింతపల్లి తీరంతో పడవల మరమ్మతులకు కట్టిన భవనం ఇలా..
ముక్కాం తీరంలో ఏర్పాటుచేసిన సామాజిక కేంద్రం ప్రారంభానికి నోచుకోలేదు. ఇక్కడ 20 సెంట్ల స్థలంలో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. ఒడ్డు నుంచి రహదారి లేనందున మత్స్యకారులు ఆసక్తి చూపక అలాగే వదిలేశారు. వీరికి అవగాహన కల్పించి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చొరవ తీసుకోలేదు.
- చింతపల్లి తీరంలో ఫిష్ ల్యాండింగ్ కేంద్రం నిరుపయోగంగా ఉండిపోగా... దీని అభివృద్ధి కోసం మత్స్యశాఖ ప్రత్యేకంగా నిధులు రూ.12.50 లక్షలు కేటాయించడం విశేషం. ఒడ్డుకు దూరంగా, అందుబాటులో లేని భవనాలను బాగు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని స్థానిక మత్స్యకారులే పెదవి విరుస్తున్నారు.
పరిశీలించి పునరుద్ధరిస్తాం..
- నిర్మలాకుమారి, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ
తీర గ్రామాల్లో సామాజిక కేంద్రాల పరిస్థితిని పరిశీలించి పునరుద్ధరణకు ప్రణాళిక చేపడతాం. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ ఉద్దేశం. వీటికి అవసరమైన మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల్లో అవగాహన కల్పించి వినియోగంలోకి వచ్చేలా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్షా సప్తాహ్ కార్యక్రమం
[ 27-07-2024]
శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. -
ఐటీడీఏ ఎదుట గిరిజన సీఆర్టీల నిరసన
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గిరిజన సీఆర్టీలు ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఆర్పీలు దీక్షలు చేస్తున్నారు. -
తొలి విడతగా పాఠశాలలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : కూటమి ప్రభుత్వం వచ్చాక పేద విద్యార్థులకు మరింత ఊరట కలిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, అచ్చు పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో హామీ ఇచ్చారు. -
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..