మండుటెండలో సమరోత్సాహం
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం..
కూటమి అభ్యర్థి కళా వెంకటరావు నామపత్రాలు దాఖలు
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కళా వెంకటరావు, పక్కన నాగార్జున, రామ్మల్లిక్నాయుడు
గరివిడి, చీపురుపల్లి, న్యూస్టుడే: పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపరిచిన చీపురుపల్లి తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బుధవారం నామపత్రాలు దాఖలు చేశారు. కనక మహాలక్ష్మీ అమ్మవారికి పూజలు చేసి ఉదయం 11.10 గంటలకు ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి బి.శాంతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కళా వెంట తెదేపా నేతలు మాజీ ఎమ్మెల్యే గద్దెబాబూరావు, నియోజకవర్గ పూర్వపు ఇన్ఛార్జి కె.త్రిమూర్తులరాజు, దన్నాన రామచంద్రుడు, రౌతు కామునాయుడు, పార్టీ పరిశీలకుడు వెలగపూడి గోపాల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లి రోడ్లపై కదంతొక్కిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు
ఆస్తులు ఇవీ
చీపురుపల్లి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు బుధవారం నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆర్వోకు సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తులు, కేసుల వివరాల ప్రకారం.. చేతిలో, బ్యాంకులో నగదుతో పాటు వాహనాలు, బంగారం తదితర చరాస్తులు తన పేరిట రూ.40,42,251, భార్య పేరుపై రూ.2,91,57,082, హిందూ అవిభక్త కుటుంబం విభాగం కింద రూ.13,89,560 చూపించారు. స్థిరాస్తుల మార్కెట్ విలువ ప్రకారం కళా పేరుపై రూ.4,43,99,400, భార్య పేరిట రూ.18,22,51,000 ఉన్నాయి. రుణాలు లేవు. నెల్లిమర్ల మండలం రామతీర్థంలో 2021లో రాముని విగ్రహం శిరస్సు నరికిన సంఘటన సమయంలో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లినందుకు అక్కడి ఠాణాలో పలు సెక్షన్లపై కేసు, పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి ఉల్లాసపేటలో పర్యటించారంటూ ఆమదాలవలస ఠాణాలో మరో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం