సాగుకు సమాయత్తం
తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది.
విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసిన వరి విత్తనాల బస్తాలు
విజయనగరం వ్యవసాయవిభాగం, పార్వతీపురం, న్యూస్టుడే: తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా కేటాయింపుల ప్రకారం బస్తాలను సమకూరుస్తోంది. రెండు జిల్లాల్లో 72,947 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని సంస్థ పేర్కొంటోంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతుల చెంతకు చేర్చాలని భావిస్తోంది. అందులో భాగంగా మొలక శాతాన్ని పరిశీలిస్తూ, శుద్ధి చేసి బస్తాల్లో ప్యాకింగ్ చేసే పనుల్లో ఏపీ సీడ్స్ తీరిక లేకుండా ఉంది. రాయితీని మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
రెండు జిల్లాల్లో ఇలా..
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో 1,63,698 హెక్టార్లలో వరి సాగు చేయించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. విజయనగరం జిల్లాలో 90,811 హెక్టార్లు, మన్యంలో 72,887 హెక్టార్లుగా నిర్ణయించింది. అందులో భాగంగా 46,531, 26,416 క్వింటాళ్ల చొప్పున వివిధ రకాల విత్తనాలు అందించనున్నారు.
మొలకశాతం పరిశీలనకు ప్రత్యేక ఏర్పాట్లు ఇలా..
మూడు చోట్ల నిల్వ కేంద్రాలు..
- నెలివాడలోని గోదాము నుంచి విజయనగరం, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, గంట్యాడ, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మొరకముడిదాం, రాజాం, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, వంగర మండలాలకు విత్తనాలు సరఫరా చేయనున్నారు.
- కొత్తవలస నుంచి ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస, జామి, వేపాడ
సాలూరులోని నిల్వ కేంద్రం ద్వారా సాలూరు, మక్కువ, పాచిపెంట, రామభద్రాపురం, బొబ్బిలి, బాడంగి, తెర్లాం, భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, పార్వతీపురం, కురుపాం, జి.ఎల్.పురం, గురుగుబిల్లి, సీతానగరం మండలాలకు సరకు చేరనుందని ఏపీ సీడ్స్ ప్రబంధకురాలు ఎస్.పద్మ తెలిపారు. స్టాక్ పాయింట్లలో నిల్వలను సిద్ధం చేస్తున్నామని, అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రాలకు పంపిస్తామన్నారు. జూన్ మొదటి వారంలో పంపిణీకి చర్యలు చేపడతామని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల