కేజీబీవీల్లో అక్రమాలు..!
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది.
గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. గతేడాది సెప్టెంబరు 9న రాష్ట్రవ్యాప్తంగా అయిదు జిల్లాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లోపాలను బయటపెట్టింది. రూ.89.26 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఇందులో విజయనగరం జిల్లా ఒకటి. ఈ మేరకు బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆ సంస్థ లేఖ రాసిన నేపథ్యంలో రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లాకు ఆదేశాలిచ్చారు. అకౌంటెంట్, ప్రధానాచార్యులు, జీసీడీవోల విధినిర్వహణలో అలసత్వం, పర్యవేక్షణ, ఆడిటింగ్ లేకపోవడంపై చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 15లోగా చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో జిల్లా విద్యాశాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది.
చేసిన సూచనలివీ..
తనిఖీల్లో భాగంగా కొన్ని సూచనలు చేసింది. బీ జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి విద్యాలయంలో కిచెన్గార్డెన్స్ నిర్వహించాలని పేర్కొంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు పండించడం ద్వారా ఆర్థిక వెసులుబాటు, విద్యార్థులకు సాగుపై అవగాహన కల్పించాలని అయిదేళ్ల క్రితమే అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం దీనిని పట్టించుకోకపోవడంతో పదుల సంఖ్యలో కూడా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. బీ స్టూడెంట్ మెస్ కమిటీలు కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. గతంలోనే ఈ కమిటీలున్నా నామమాత్రమయ్యాయి. మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించేలా చూడాలి. కొత్తగా ఏర్పాటు చేయనున్న కమిటీల్లో 8,9,10, ఇంటర్ తరగతుల నుంచి ఒక్కొక్కరు చొప్పున అయిదుగురితో కమిటీ ఉండాలి. సీనియర్ విద్యార్థిని కమిటీకి హెడ్గా నియమించాలి. మెస్ నిర్వహణ, స్టోర్ మేనేజ్మెంట్, విద్యార్థినులకు పోషకాహారం అందుతుందా? మెస్ నిర్వహణకయ్యే వ్యయాన్ని పర్యవేక్షించాలి. పరిపాలన, వంట పనివాళ్లు, సహాయకులతో సమన్వయం చేసుకుని రోజువారీ ఇస్తున్న మెనూ, సరకుల కొనుగోలు, కూరగాయల సరఫరా, నాణ్యతను పరిశీలించాలని పేర్కొంది.
కేజీబీవీల వారీగా రావాలి: జిల్లాకు సంబంధించి ఆదేశాలు వచ్చాయి. అక్రమాలు, దుర్వినియోగం గుర్తించిన కేజీబీవీ వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఏ కేజీబీవీలో సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలో త్వరలోనే వస్తాయి. వచ్చిన వెంటనే చర్యలకు ఉపక్రమిస్తాం.
ఎన్.ప్రేమకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీడీఏ ఎదుట గిరిజన సీఆర్టీల నిరసన
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గిరిజన సీఆర్టీలు ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఆర్పీలు దీక్షలు చేస్తున్నారు. -
తొలి విడతగా పాఠశాలలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : కూటమి ప్రభుత్వం వచ్చాక పేద విద్యార్థులకు మరింత ఊరట కలిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, అచ్చు పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో హామీ ఇచ్చారు. -
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు