గౌరవ వేతనం చెల్లింపులకు ఉత్తర్వులు
ఎన్నికల విధులు నిర్వహించిన బృందాలకు గౌరవ వేతనం చెల్లింపుల కోసం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తవలస, న్యూస్టుడే: ఎన్నికల విధులు నిర్వహించిన బృందాలకు గౌరవ వేతనం చెల్లింపుల కోసం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి వీలుగా జిల్లాలో ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ, ఏటీ, ఈఈఎం బృందాలను ఏర్పాటు చేశారు. ఇంతకాలం వీరికి పారితోషికం చెల్లింపు విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగింది. వీటిలో కొన్ని బృందాలు నోటిఫికేషన్ నుంచి, మరికొన్ని నామినేషన్లు ప్రారంభం నుంచి విధుల్లో పాల్గొన్నాయి. వీరికి గౌరవ వేతనం ఆర్వోలు/సహాయ ఆర్వోలు ఒకే విధంగా చెల్లించడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఏకమొత్తంగా ప్రతిపాదించారు. దీని ప్రకారం సెక్టర్ అధికారులకు రూ.15 వేలు, రిజర్వులో ఉన్న సెక్టర్ అధికారులు ఒక్కొక్కరికి రూ.8 వేలు చొప్పున, ఎఫ్ఎస్టీ (ఫ్లయింగ్ స్క్వాడ్ టీం), ఎస్ఎస్టీ, వీఎస్వీ, ఎంసీసీ, ఏటీ, వీవీటీ, ఈఈఎం టీం లీడర్లకు రూ.10 వేల చొప్పున, సభ్యులకు రూ.8 వేల చొప్పున, రిజర్వులో ఉన్న వారికి రూ.6 వేల చొప్పున ప్రతిపాదించారు. ఏఈఓకి రూ.10 వేలు, రిజర్వులో ఉన్న వారికి రూ.6 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ టీం హెడ్కి రూ.10 వేలు, సభ్యులకు రూ.8 వేలు చెల్లించాలని తెలిపారు. వీఎస్టీ టీంలో లీడరుగా పనిచేసిన పీసీకి రూ.10 వేలు, సభ్యులకు(పీసీలు) రూ.8 వేలు, రిజర్వులో ఉన్నవారికి రూ.6 వేలు చెల్లించాలని ప్రతిపాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం