వారంలో రాష్ట్ర ప్రజలకు స్వతంత్రం
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లగలరని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు.
చంద్రబాబు ఎక్స్వో పుస్తకావిష్కరణలో అశోక్ గజపతిరాజు
చంద్రబాబు ఎక్స్వో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అశోక్ గజపతిరాజు, చిత్రంలో ఎమ్మెల్సీలు రఘువర్మ, చిరంజీవిరావు, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి
అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాస్, రచయిత శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లగలరని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. రచయిత ఎస్.శ్రీనివాస్ ప్రసాద్ రచించిన ‘చంద్రబాబు ఎక్స్వో.. అనంత భావజాలికుడు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి విజయనగరంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరో వారం రోజుల్లో రాష్ట్ర ప్రజలకు స్వతంత్రం రాబోతోందని, ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అరాచకానికి అంతం పలికి విజయోత్సవాలకు స్వాగతం పలకబోతున్నామన్నారు. ప్రజలంతా నిర్భయంగా ఓటేశారని, అధికార పార్టీ బెదిరింపులకు లొంగకుండా ముందడుగు వేశారన్నారు. సాంకేతికత, ఐటీ రంగానికి చంద్రబాబు పునాదులు వేస్తే వైకాపా వచ్చాక దోచుకునేందుకు వాటిని వినియోగించిందని ఆరోపించారు. రాజధాని అమరావతిని దారుణంగా మార్చేసిందని మండిపడ్డారు. తాకట్లు, అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురాగల శక్తి, సామర్థ్యాలు చంద్రబాబుకే ఉన్నాయని, మంచి ఆలోచనలతో అభివృద్ధి చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజన్ అంటే ఆ ఇద్దరే..
విజన్ అనగానే గుర్తొచ్చేవారిలో ఒకరు అబ్దుల్కలాం కాగా.. మరొకరు చంద్రబాబేనని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు కొనియాడారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తనలాంటి ఎంతోమంది కార్యకర్తలను రాజకీయ నాయకులుగా చేసి, వారి ఎదుగుదలకు తెదేపా అధినేత ఎంతో కృషి చేశారని కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రచయిత ఎస్.శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబును దగ్గర నుంచి చూశానని, ఆయన ఆలోచన తీరు గొప్పదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, విజయనగరం, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థులు అదితి గజపతిరాజు, కొండపల్లి శ్రీనివాస్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి పావని, గొంప కృష్ణ, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ.రాజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీడీఏ ఎదుట గిరిజన సీఆర్టీల నిరసన
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గిరిజన సీఆర్టీలు ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఆర్పీలు దీక్షలు చేస్తున్నారు. -
తొలి విడతగా పాఠశాలలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : కూటమి ప్రభుత్వం వచ్చాక పేద విద్యార్థులకు మరింత ఊరట కలిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, అచ్చు పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో హామీ ఇచ్చారు. -
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..