వంబరిల్లి ఘాట్లో ఆటో బోల్తా
సీతంపేట మండలంలో వంబరిల్లి ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది. ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న వాహనం కొండ ఎక్కలేక వెనక్కి జారడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
బాలుడి మృత్యువాత
16 మందికి తీవ్ర గాయాలు
నలుగురి పరిస్థితి విషమం
ప్రాంతీయాసుపత్రిలో క్షతగాత్రులు
సీతంపేట, న్యూస్టుడే: సీతంపేట మండలంలో వంబరిల్లి ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది. ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న వాహనం కొండ ఎక్కలేక వెనక్కి జారడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతిచెందాడు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై జగదీశ్ నాయుడు, స్థానికుల వివరాల ప్రకారం.. వంబరిల్లి ప్రాంతానికి చెందిన గిరిజనులు సీతంపేట వారపు సంతకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో బుడ్డడుగూడకు చెందిన ఎస్.మధు ఆటోలో ఎక్కారు. కొత్తగూడ దాటి స్వగ్రామానికి సమీపంలోని ఘాటీ మార్గంలో ఆటో నియంత్రణ కోల్పోయింది. పరిమితికి మించిన ప్రయాణికులతో కొండ మీదుగా ఉన్న సీసీ రహదారి ఎక్కలేక వెనక్కి జారిపోయింది. అలా సుమారు వంద అడుగుల కిందకు వచ్చి లోయలో పడిపోయింది. వాహనం నుజ్జవగా.. అందులో ఉన్న 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హాహాకారాలు..
లోయలో పడ్డ ఆటోలో అందరూ ఇరుక్కుపోయారు. కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోవడంతో అతికష్టంపై బయటకు రాగలిగారు. మరికొందరు అందులోనే ఉండిపోయారు. వారి హాహాకారాలతో లోయ ప్రాంతమే కన్నీరు పెట్టింది. క్షతగాత్రుల అరుపులు విన్న స్థానికులు, అటుగా వెళుతున్న ప్రయాణికులు పరుగున వెళ్లారు. అతికష్టం మీద బాధితులను బయటకు తీశారు. అక్కడి నుంచి సీతంపేట ప్రాంతీయాసుపత్రికి తరలించారు. సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందించారు.
వేర్వేరు ఆసుపత్రుల్లో..
తీవ్రంగా గాయపడిన సవర లక్ష్మి, సవర డొంబయ్య, అనిత, కవిత, సుక్కమ్మ, టిక్కమ్మ, అడ్డాయి, బెన్నయ్య, ఉష, తుంపమ్మను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వీరిలో అనిత, లక్ష్మి, డొంబయ్య, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. బాలుడు సవర కార్తీక్(10)తో పాటు ఆటో చోదకుడు మధును రాగోలులోని జెమ్స్కు చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్ మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు సవర నవీన్ పాలకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రాంతీయాసుపత్రిలో సుక్కమ్మ, రమణ ఉండగా.. లాస్య డిశ్ఛార్జి అయ్యారు. ప్రయాణికుడు సాంబయ్య ముందుగానే గెంతేయడంతో సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సీఐ చంద్రమౌళి బాధితులను పరామర్శించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శంకరరావు సేవలపై ఆరా తీశారు.
ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే: నిమ్మక
క్షతగాత్రులను కూటమి పాలకొండ నియోజకవర్గం అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పరామర్శించారు. రక్షణ గోడలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, ఎప్పటి నుంచో నిర్మించాలని కోరుతున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం వల్లే గిరిజనులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పడాల భూదేవి తదితరులు పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్షా సప్తాహ్ కార్యక్రమం
[ 27-07-2024]
శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. -
ఐటీడీఏ ఎదుట గిరిజన సీఆర్టీల నిరసన
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గిరిజన సీఆర్టీలు ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఆర్పీలు దీక్షలు చేస్తున్నారు. -
తొలి విడతగా పాఠశాలలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
[ 27-07-2024]
పార్వతీపురం టౌన్ : కూటమి ప్రభుత్వం వచ్చాక పేద విద్యార్థులకు మరింత ఊరట కలిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, అచ్చు పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో హామీ ఇచ్చారు. -
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్