ఫిష్ ఆంధ్ర.. మూణ్నాళ్ల ముచ్చటే
యువతకు స్వయం ఉపాధి, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు, ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మత్స్య సంపదను అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం..
ఆర్భాటపు ప్రచారంతో సరి
అందుబాటులోకి రాని అవుట్లెట్లు
మెంటాడ మండల కేంద్రంలో మూతపడిన దుకాణం
భోగాపురం, గజపతినగరం, కోట, న్యూస్టుడే: యువతకు స్వయం ఉపాధి, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు, ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మత్స్య సంపదను అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం.. ఫిష్ ఆంధ్రా కింద అవుట్లెట్లను ఆర్భాటంగా ప్రారంభించింది. వీటి ఏర్పాటుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 24 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం రాయితీ అందించాయి. మిగిలిన సొమ్మును బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పొందాలి. స్థానిక చెరువులు, రిజర్వాయర్ల నుంచి చేపలు సరఫరా చేస్తామని, వాటినే మార్కెట్ కన్నా తక్కువ ధరకు వినియోగదారులకు విక్రయించాలని యంత్రాంగం స్పష్టం చేసింది. దీంతో నిరుద్యోగ యువకులు అవుట్లెట్లను నెలకొల్పేందుకు ఉత్సాహం చూపారు. ఏర్పాటైన తరువాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ఆ దుకాణాలన్నీ మూతపడుతున్నాయి.
విజయనగరం జిల్లాలో 170 ఫిష్ ఆంధ్రా దుకాణాలు ఏర్పాటు చేశారు. యూనిట్ వ్యయాన్ని రూ.1.50 లక్షలుగా నిర్ణయించగా రూ.30 వేలు దుకాణదారుడు చెల్లించాలి. అయితే ప్రస్తుతం వీటిలో 111 వరకు మూతపడ్డాయి. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొత్తవారికి ఇవ్వాలని అనుకున్నా ఇప్పటికే ఉన్న యూనిట్లకు సక్రమంగా చేపలు సరఫరా చేయడం లేదు. దీంతో వారికి వ్యాపారం జరగకపోవడంతో మూసేస్తున్నారు. కొందరు ఆదివారం ఒక రోజు చేపలు తెచ్చుకొని విక్రయించుకుంటున్నారు. ఇదే సమయంలో విద్యుత్తు బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఎవరూ ముందుకురావడం లేదు.
మత్స్యకారులే స్వయంగా..
జిల్లాలో సముద్రతీర ప్రాంతం ఉంది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని వివిధ మత్స్యకార గ్రామాల నుంచి జిల్లా వ్యాప్తంగా చేపలు సరఫరా అవుతున్నాయి. కొందరు మత్స్యకారులు నేరుగా వెళ్లి విక్రయిస్తున్నారు. వీరు తక్కువ ధరలకే ఇస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన దుకాణాల్లో మాత్రం అధిక ధరలు ఉన్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. తక్కువ అమ్మాలంటే తాము నష్టపోతామని నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. ఈక్రమంలో దుకాణాలన్నీ మూతపడుతున్నాయి.
లక్ష్యం చేరేలా కృషి.. అవుట్లెట్లు మూతపడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. కొంతమేర ఇబ్బందులున్నా పరిష్కరించి లక్ష్యాలు సాధించేలా కృషి చేస్తాం. యువతలో చైతన్యం కల్పించి వారికి అవసరమైన సహకారం అందిస్తున్నాం. రుణాల మంజూరు, రాయితీలు మంజూరయ్యేలా చొరవ తీసుకుంటాం.
నిర్మలాకుమారి, జిల్లా మత్స్యశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
[ 26-07-2024]
బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం మండల ప్రత్యేకాధికారి, జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రాబర్ట్పాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
విద్యుత్తు కోతతో అవస్థలు
[ 26-07-2024]
బలిజిపేట మండలంలోని చిలకలపల్లి, వంతరాం విద్యుత్తు ఉపకేంద్రాల్లో అయిదు రోజులుగా విధిస్తున్న విద్యుత్తు కోతల వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
రహదారి బురదమయం
[ 26-07-2024]
దశాబ్దాల కిందట రూ.33లక్షల పీఎంజీఎస్వై నిధులతో నిర్మించిన తారురోడ్డు ఎక్కడికక్కడ గోతులతో నిండిపోయింది. -
సైనికుల త్యాగాలు మరువలేం..
[ 26-07-2024]
వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ దివస్ ర్యాలీ నిర్వహించారు. -
విజ్ఞాన వికాస కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
[ 26-07-2024]
విజ్ఞాన వికాస కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ కోరారు. -
డబ్బు కొట్టు.. ఇంక్రిమెంట్ పట్టు
[ 26-07-2024]
జిల్లాలో 2020లో సచివాలయ వ్యవస్థ నోటిఫికేషన్లో కొలువులు దక్కించుకుని రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం 2023 ఏప్రిల్లో ప్రొబేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. -
రూ.14 కోట్లు ఎక్కడ?
[ 26-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి హమాలీ, రవాణా ఛార్జీలు నేటికీ అందలేదు. -
నీరెత్తిపోసేలా.. పంటలు పండేలా..
[ 26-07-2024]
ఉమ్మడి జిల్లాలో మెట్ట భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు.. రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఏపీఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో గతంలో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. -
చితికిల‘బడి’
[ 26-07-2024]
నూతన జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.117 ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. -
రక్తహీనత.. మన్యం బిడ్డల బలహీనత
[ 26-07-2024]
మన్యం బిడ్డలను రక్తహీనత పీడిస్తోంది.. కొత్త జీవికి రూపమిచ్చే గర్భిణులు.. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిన్నారులు సైతం రక్తం లేక ఆసుపత్రుల్లో చేరుతున్నారు. -
చంద్రబాబును కలిసిన అశోక్
[ 26-07-2024]
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
కందిపప్పు, బియ్యానికి బె‘ధర’క్కర్లేదు!
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ఆకాశమే హద్దుగా నిత్యావసర ధరలు ఎగిశాయి. -
ఎట్టకేలకు రోడ్డు మరమ్మతులు
[ 26-07-2024]
బొబ్బిలి- తెర్లాం రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎమ్మెల్యే బేబినాయన సొంత నిధులు వెచ్చించి బాగు చేయిస్తున్నారు. -
మామయ్య మాయాదీవెన
[ 26-07-2024]
‘తల్లిదండ్రులంతా మీ పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారికి మేనమామలా అండగా ఉంటా’ అంటూ అయిదేళ్లూ పబ్బం గడిపేశారు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి.. మాయమాటలతో ఏమార్చి విద్యా, వసతి దీవెనల కింద ఇవ్వాల్సిన నిధులను చెల్లించకుండా నిలువునా ముంచేశారు.. -
ప్రాణాలతో చెలగాటం
[ 26-07-2024]
వరుస విద్యుత్తు ప్రమాదాలతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. -
కుక్కల దాడిలో ఆరుగురికి గాయాలు
[ 26-07-2024]
జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడుల్లో గాయపడుతున్న బాధితుల సంఖ్య పెరుగతూపోతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత