ప్రయాణికుల చరవాణులపైనే గురి!
జల్సాల కోసం సెల్ఫోన్లు, మోటారు సైకిళ్లు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 54 చరవాణులతో పాటు, 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
54 సెల్ఫోన్లు, 9 వాహనాల స్వాధీనం
ప్రత్తిపాడు, న్యూస్టుడే: జల్సాల కోసం సెల్ఫోన్లు, మోటారు సైకిళ్లు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 54 చరవాణులతో పాటు, 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.13.52 లక్షలు ఉంటుందని సీఐ కిశోర్బాబు తెలిపారు. సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. తుని గ్రామీణ మండలం కొలిమేరుకు చెందిన బొందల అప్పారావు, ఎస్.కోట మండలం కొత్తవలసకు చెందిన బోధల సురేష్ తుని, అన్నవరం, సామర్లకోట రైల్వేస్టేషన్లలో మకాం వేసి, చోరీలకు అలవాటు పడ్డారు. రైల్లో ప్రయాణాలు చేసి ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్లను వీరు దొంగిలించేవారు. యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఫోన్ల లాక్లను తెరవడం, వాటి డేటాను తొలగించి విక్రయించడానికి అలవాటు పడ్డారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లేవారు. వాటిని అమ్మి, ఆ నగదుతో జల్సాలు చేసేవారు. అన్నవరం పరిసరాల్లో అద్దె గదిలో ఉండగా.. తమకు అందిన సమాచారం మేరకు అరెస్టు చేశామని సీఐ చెప్పారు. అప్పారావు నుంచి ఒక మోటారు సైకిల్, 6 చరవాణులు, సురేష్ నుంచి 48 చరవాణులు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీకి గురైన ఫోన్లకు సాంకేతిక సహకారం అందించిన వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్