దద్దరిల్లిన కలెక్టరేట్
కలెక్టరేట్ ప్రాంగణం సోమవారం నిరసనలతో హోరెత్తింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయిల్పామ్ రైతులు, సీపీఐ, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనలు చేశారు.
బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు
కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్టుడే: కలెక్టరేట్ ప్రాంగణం సోమవారం నిరసనలతో హోరెత్తింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయిల్పామ్ రైతులు, సీపీఐ, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనలు చేశారు.
ముఖ హాజరు వద్దు.. అంగన్వాడీలను ముఖ హాజరు నుంచి మినహాయించాలని జిల్లా గౌరవాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, ప్రధాన కార్యదర్శి జ్యోతి కోరారు. అన్ని మండలాల నుంచి కార్యకర్తలు తరలివచ్చి కలెక్టరేట్ ముందు బైఠాయించారు. కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. 300 జనాభా దాటిన మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలన్నారు. అనంతరం జేసీ ఆనంద్కు వినతిపత్రం ఇచ్చారు. సిటూ నాయకులు ఇందిర, ప్రాజెక్టు అధ్యక్షురాలు సరళికుమారి, సిటూ నాయకుడు మన్మథరావు తదితరులు ఉన్నారు.
రూ.5 లక్షలివ్వాలి.. ప్రస్తుతం అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఇస్తున్న రూ.1.80 లక్షలు సరిపోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు అన్నారు. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్ల స్థలం మంజూరు చేయాలన్నారు.
కూలి ధర పెంచాలి.. ఆయిల్పామ్ కూలి ధరలు పెంచాలని ఏపీ పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. కూలి ధరను రూ.వెయ్యి చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేసేందుకు వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎక్కువ మంది రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ కృష్ణారావు, ఎస్ఐ ఫకృద్దీన్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
15 నెలలుగా జీతాలు లేవాయె
వైటీసీ సిబ్బంది ఆవేదన
సీతంపేట, న్యూస్టుడే: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో పీవో బి.నవ్య ఆధ్వర్యంలో జరిగిన గిరిజన స్పందనకు 51 అర్జీలు వచ్చాయి. సీతంపేట, పాతపట్నం, శ్రీకాకుళం, మందసలోని గిరిజన యువత శిక్షణ కేంద్రాల్లో పనిచేస్తున్న కేర్ టేకర్లు, సిబ్బంది మొత్తం 24 మంది 15 నెలలుగా జీతాలు అందలేదని, దీంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని మొరపెట్టుకున్నారు. ఆప్కాస్లో నమోదై ఉన్నా బడ్జెట్ లేని కారణంగా చెల్లింపులు లేవని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జీతాలు అందేలా చూడాలని వైటీసీ కేర్ టేకర్లు మల్లేష్, శ్రీనివాసరావు, రామినాయుడు తదితరులు విన్నవించారు. మందస వైటీసీకి కృష్ణపట్నం పోర్టు అద్దె, నిర్వహణ కింద రూ.18 లక్షలు చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తాన్ని వసూలు చేసి తమకు జీతాలుగా ఇప్పించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?