దద్దరిల్లిన కలెక్టరేట్
కలెక్టరేట్ ప్రాంగణం సోమవారం నిరసనలతో హోరెత్తింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయిల్పామ్ రైతులు, సీపీఐ, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనలు చేశారు.
బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు
కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్టుడే: కలెక్టరేట్ ప్రాంగణం సోమవారం నిరసనలతో హోరెత్తింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయిల్పామ్ రైతులు, సీపీఐ, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనలు చేశారు.
ముఖ హాజరు వద్దు.. అంగన్వాడీలను ముఖ హాజరు నుంచి మినహాయించాలని జిల్లా గౌరవాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, ప్రధాన కార్యదర్శి జ్యోతి కోరారు. అన్ని మండలాల నుంచి కార్యకర్తలు తరలివచ్చి కలెక్టరేట్ ముందు బైఠాయించారు. కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. 300 జనాభా దాటిన మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలన్నారు. అనంతరం జేసీ ఆనంద్కు వినతిపత్రం ఇచ్చారు. సిటూ నాయకులు ఇందిర, ప్రాజెక్టు అధ్యక్షురాలు సరళికుమారి, సిటూ నాయకుడు మన్మథరావు తదితరులు ఉన్నారు.
రూ.5 లక్షలివ్వాలి.. ప్రస్తుతం అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఇస్తున్న రూ.1.80 లక్షలు సరిపోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు అన్నారు. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్ల స్థలం మంజూరు చేయాలన్నారు.
కూలి ధర పెంచాలి.. ఆయిల్పామ్ కూలి ధరలు పెంచాలని ఏపీ పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. కూలి ధరను రూ.వెయ్యి చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేసేందుకు వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎక్కువ మంది రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ కృష్ణారావు, ఎస్ఐ ఫకృద్దీన్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
15 నెలలుగా జీతాలు లేవాయె
వైటీసీ సిబ్బంది ఆవేదన
సీతంపేట, న్యూస్టుడే: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో పీవో బి.నవ్య ఆధ్వర్యంలో జరిగిన గిరిజన స్పందనకు 51 అర్జీలు వచ్చాయి. సీతంపేట, పాతపట్నం, శ్రీకాకుళం, మందసలోని గిరిజన యువత శిక్షణ కేంద్రాల్లో పనిచేస్తున్న కేర్ టేకర్లు, సిబ్బంది మొత్తం 24 మంది 15 నెలలుగా జీతాలు అందలేదని, దీంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని మొరపెట్టుకున్నారు. ఆప్కాస్లో నమోదై ఉన్నా బడ్జెట్ లేని కారణంగా చెల్లింపులు లేవని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జీతాలు అందేలా చూడాలని వైటీసీ కేర్ టేకర్లు మల్లేష్, శ్రీనివాసరావు, రామినాయుడు తదితరులు విన్నవించారు. మందస వైటీసీకి కృష్ణపట్నం పోర్టు అద్దె, నిర్వహణ కింద రూ.18 లక్షలు చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తాన్ని వసూలు చేసి తమకు జీతాలుగా ఇప్పించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.